దిశ తరహాలో మరో దారుణం!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరువకముందే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో అదే తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి ఆతర్వాత హత్యచేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని ఓ బ్రిడ్జి కింద నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి. స్థానికుల పర్యాధు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 4:52 pm
Follow us on


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన మరువకముందే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో అదే తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి ఆతర్వాత హత్యచేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని ఓ బ్రిడ్జి కింద నగ్నంగా ఉన్న యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తలపై తీవ్ర గాయాలున్నాయి.

స్థానికుల పర్యాధు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో ..అత్యాచారం చేసి ఆతర్వాత హత్యచేసి ఉంటారని, యువతిని గుర్తించకుండా ఉండటం కోసం తలపై రాయితో బాదినట్టు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.