ఎటూ తేలని చేవెళ్ల అత్యాచార, హత్య కేసు!

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లిలో యువతి అత్యాచార, హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు దాటుతున్నా ఇంకా నిజా-నిజాలు ఏవీ వెలుగులోకి రాలేదు. ఆ యువతీ ఎవరనేది తెలిస్తే కానీ కుటుంబ సభ్యుల చిరునామా తెలియదు. కాబట్టి అప్పటిదాకా ఆమె మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండనుందని పోలీసులు అంటున్నారు. యువతిపై జరిగిన దారుణం వెనుక అనేక సందేహాలు, అనేక అనుమానాలు నెలకొన్నా ఎటూ తేలడం […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 4:15 pm
Follow us on

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లిలో యువతి అత్యాచార, హత్య కేసు మిస్టరీగా మారింది. ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు దాటుతున్నా ఇంకా నిజా-నిజాలు ఏవీ వెలుగులోకి రాలేదు. ఆ యువతీ ఎవరనేది తెలిస్తే కానీ కుటుంబ సభ్యుల చిరునామా తెలియదు. కాబట్టి అప్పటిదాకా ఆమె మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉండనుందని పోలీసులు అంటున్నారు. యువతిపై జరిగిన దారుణం వెనుక అనేక సందేహాలు, అనేక అనుమానాలు నెలకొన్నా ఎటూ తేలడం లేదు. ఆమె ఎవరు ? ఏమిటి అనేది ఇంకా తేలలేదు.  యువతీ ఆచూకీ తెలియడం కోసం 5 టీమ్ లతో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే యువతీ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు.

ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. సీసీ కెమెరాల పరిశీలన కోసం ఒక బృందంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంగడపల్లి రోడ్డు మార్గం తెలిసిన వ్యక్తులే ఈ పని చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మొదట మహిళను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నిందితులు వంతెన కింద పడేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఆమె మీద అత్యాచారం జరిగిందా? లేదా ? అనేది తెలుసుకోడానికి ఆమె డీఎన్ఏ నమూనాలను ఉస్మానియా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఆమె ఒంటి మీదున్న బంగారు ఆభరణాలను బట్టి ఆమె నార్త్ ఇండియన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు, లేదంటే అక్రమ సంబంధం ప్రధాన కారణం అయ్యి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారింది. అది వస్తే పోలీసులు ఈ కేసు చేధించే అవకాశం కనిపిస్తోంది.