జగన్ జనంలోకి రారా?

కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంలు చెబుతున్నారు. అందుకు తగినట్లుగా ప్రజలతో కలిసి తిరుగుతున్నారు. కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ర్టాల ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఇంటికే […]

Written By: NARESH, Updated On : May 20, 2021 4:19 pm
Follow us on

కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంలు చెబుతున్నారు. అందుకు తగినట్లుగా ప్రజలతో కలిసి తిరుగుతున్నారు. కరోనా వైరస్ ను తుదముట్టించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ర్టాల ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి మాత్రం ఇంటికే పరిమితమవుతున్నారు. పరిపాలన అంతా ఇంటి నుంచే కొనసాగిస్తున్నారు. మొదటి వేవ్ లో కూడా సీఎం జగన్ ఇంటి నుంచే పరిపాలన చేయడం గమనార్హం.

వర్క్ ఫ్రం హోం
కరోనా ప్రభావంతో ఉద్యోగులకు మాత్రమే వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉంటుంది. కానీ ఏపీ సీఎం జగన్ కరోనా సెకండ్ వేవ్ లో ప్రజల కష్టాలు పట్టించుకోకుండా వర్క్ ఫ్రం హోం సాగిస్తుండడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇంటికే పరిమితమైన సీఎంను ఇంటికే సాగనంపాలని విమర్శలు చేస్తున్నాయి. అయినా జగన్ లో చలనం లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. తిరుపతిలో పదకొండు మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారనే విషయం సీఎం జగనే ప్రకటించడం చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియాలో..
సీఎం జగన్ ఇల్లు దాటకపోవడంపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం గొప్పగా పని చేస్తుందని సీఎం జగన్ చెప్పుకుంటున్నావాస్తవం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయి.