ఇక ఊరుకునేది లేదట.. కేంద్రానికి డిమాండ్లు పెట్టనున్న జగన్‌

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో బై ఎలక్షన్లు కూడా నిర్వహిస్తున్నారు. వాటికి కూడా షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గెలిచే అవకాశాలున్న రాష్ట్రాలు అసోం, పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. Also Read: ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ […]

Written By: Srinivas, Updated On : March 20, 2021 12:12 pm
Follow us on


దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో బై ఎలక్షన్లు కూడా నిర్వహిస్తున్నారు. వాటికి కూడా షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. అయితే.. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గెలిచే అవకాశాలున్న రాష్ట్రాలు అసోం, పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.

Also Read: ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ సంచలన పిటీషన్

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ మమత బెనర్జీకే అవకాశాలున్నాయని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోని అన్ని పార్టీలూ స్వరం మార్చే అవకాశముంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. విభజన హామీలు అమలు చేయకపోగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో వైసీపీలో కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం పట్ల భ్రమలు తొలిగిపోతున్నాయి.

ఇప్పటికే పొరుగున ఉన్న తెలంగాణలో మొన్నటి వరకూ కొంచెం సాఫ్ట్‌గా ఉన్న అధికార టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నారు. బీజేపీ ఏపీలో బలపడేకొద్దీ భవిష్యత్తులో ఇబ్బంది తనకే తప్పదని వైసీపీ అధినేత జగన్‌కు తెలియంది కాదు. అందుకే ఆయన ఆచితూచి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వంపై కొంత దూకుడుపెంచుతారంటున్నారు ఆయన విధేయులు. ఇప్పటివరకూ వినతులకే పరిమితమైన జగన్.. ఇకనుంచి డిమాండ్లు పెట్టే అవకాశముందట. మోదీ ప్రభుత్వంపై క్రమంగా భ్రమలు తొలిగిపోతుండటంతో బీజేపీ కూడా భవిష్యత్తులో మిత్రుల అవసరం కంపల్సరీ.

Also Read: మా బాబునే విచారిస్తారా.. ఆశ.. దోష

ఈ క్రమంలో బలమైన వైసీపీని దూరం చేసుకుంటుందని ఎవరం అనుకోలేం. అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జగన్‌కు వచ్చిన అవకాశంగా వైసీపీ నేతలే కొందరు వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన సమస్యల పరిష్కారానికి జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తారని, అప్పుడు కూడా స్పందన లేకుంటే జగన్ వ్యతిరేక వాయిస్ విన్పిస్తారన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మే 3 తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్