సాగర్ లో కోదండరామ ‘మంత్రం’ ఏమిటి..?

ఉద్యమాలు చేసినంత మాత్రాన ఎన్నికల సందర్భంగా జనం జై కొడుతారన్న నమ్మకం లేదు. నల్లగొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల తరువాత ప్రొఫెసర్ కోదండరాం ఇదే తెలుసుకున్నట్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత మనసు మార్చుకున్న ప్రొఫెసర్ సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న వ్యూహం పై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏ ఎన్నికల్లో అయినా.. పోల్ మేనేజ్మెంట్ లేకపోతే ఇబ్బందే. వీటిపై ఇప్పుడు అవగాహన వచ్చిందో ఏమో.. […]

Written By: Srinivas, Updated On : March 25, 2021 2:23 pm
Follow us on


ఉద్యమాలు చేసినంత మాత్రాన ఎన్నికల సందర్భంగా జనం జై కొడుతారన్న నమ్మకం లేదు. నల్లగొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల తరువాత ప్రొఫెసర్ కోదండరాం ఇదే తెలుసుకున్నట్లు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత మనసు మార్చుకున్న ప్రొఫెసర్ సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న వ్యూహం పై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏ ఎన్నికల్లో అయినా.. పోల్ మేనేజ్మెంట్ లేకపోతే ఇబ్బందే. వీటిపై ఇప్పుడు అవగాహన వచ్చిందో ఏమో.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత కీలక ప్రకటన చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పోటీ చేయడం లేదని.. అలాగే ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. కోదండరాం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికే కోదండరాం ఎత్తుగడలు వేశారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ నుంచి ఆయనకు ఎదురైన అనుభవాలను ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల మాదిరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోదండరామ్ కు హ్యాండిచ్చిందనే అభిప్రాయం తెలంగాణ జనసమితిలో ఉంది. దానికి ఈ రూపంలో రివేంజ్ తీర్చుకోవచ్చని కొందరు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ప్రొఫెసర్ నిర్ణయంపై మరో చర్చ సాగుతోంది. ఉప ఎన్నికల్లో పోటీచేసి శ్రమ వృథా చేసుకోవడం ఎందుకనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చని చెబుతున్నారు.

కోదండరామ్ ఎమ్మెల్సీగా పోటీ చేసినా.. ఏ ఒక్కరూ సహకరించలేదు. ముందస్తు ఎన్నికల్లో కలిసి పనిచేసిన కాంగ్రెస్ ఆఖరివరకు ఊరించి ఉసూరుమనిపించింది. ఉద్యమంలో కలిసి పనిచేసిన కామ్రేడ్లు హ్యాండిచ్చారు. జనాన్ని నమ్ముకుని బరిలో దిగితే మూడో ప్లేస్ కి పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో ఎన్నికల్లో గెలుపోటములకన్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన రాజకీయాలపైనే ఎక్కువ ఆలోచిస్తున్నారంట కోదండరాం. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కోదండరామ్ ఎవరికో మద్దతు ఇస్తారని అంతా అనుకున్నారు. రాజకీయా పార్టీల మీద కోదండరాం తన నిరసన తెలపాలి అనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.