Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: సీఎం జగన్ మీడియాతో ఎందుకు మాట్లాడరు..?

CM Jagan: సీఎం జగన్ మీడియాతో ఎందుకు మాట్లాడరు..?

CM Jagan
CM Jagan

CM Jagan: దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉంటుంది. సాధారణంగా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి, ప్రజల ఇబ్బందులు, కొత్త పథకాల అమలు వంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. అయితే అందుకు విరుద్ధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తుంటారు. మీడియా అంటే అందులోను తెలుగు మీడియా అంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం నచ్చదు. అందుకే మీడియా సమావేశాలు పెట్టేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడరు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆ తరువాత నుంచి దూరం..

అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటి, రెండు సార్లు మీడియాతో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ట్రోల్ చేశాయి. దీంతో ఆ తర్వాత నుంచి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి మానేశారు. కొద్ది నెలలపాటు ఎడిట్ చేసిన వీడియోలు మీడియాకు రిలీజ్ చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రక్రియను నిలిపేశారు. దీంతో మొత్తంగా మీడియాతో మాట్లాడాలన్న వ్యవహారాన్ని సీఎం పూర్తిగా పక్కన పెట్టేసారు.

ఎందుకు ఈ సమస్య..

సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అనేక అంశాలపై మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అనేక విషయాలను తెలియజేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మీడియాతో తనకు అవసరమే లేదన్నట్లు గత నాలుగేళ్లుగా ఆయన వ్యవహరించిన తీరును చూస్తే అర్థమవుతుంది. మీడియాతో మాట్లాడటం వలన వచ్చే లాభం కంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆయన దూరంగా ఉంటున్నారని విమర్శలు ఉన్నాయి.

CM Jagan
CM Jagan

జాతీయ మీడియాతో..

ఇక రాష్ట్రస్థాయిలో మీడియాతో మాట్లాడేందుకు అసలు ఇష్టపడని సీఎం జగన్ మోహన్ రెడ్డి జాతీయస్థాయి చానల్స్ తో మాత్రం ఎక్కువగానే మాట్లాడుతుంటారు. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు జాతి స్థాయిలో ఉన్న మీడియాతో మాట్లాడటం వలన ఏ విషయాలు తెలుస్తాయి అన్న భావన సర్వత్రా ఉంది. ఇక రాష్ట్రంలో తనకు ఉన్న సాక్షితో తప్ప మరో ఛానల్ తో మాట్లాడిన దాఖలాలు ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ కనిపించలేదు. సాక్షి ఉంటే చాలు మరే ఛానల్, పత్రిక అవసరం లేదన్న భావన ఆయనలో ఉంది. తెలుగు మీడియాను సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఆయా ప్రశ్నల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను భరించలేక మీడియాకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు చెక్ చెప్పాల్సిన జగన్ మోహన్ రెడ్డి పట్టనట్టుగా వ్యవహరించడం వలన అది నిజమేనన్న భావన ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది.

Most Popular

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
Oktelugu Epaper
Exit mobile version