Homeజాతీయ వార్తలుIndian history hidden truths: ఎవరు చొరబాటుదారులు.. చరిత్రలో దాగిన సత్యాలు ఇవీ!

Indian history hidden truths: ఎవరు చొరబాటుదారులు.. చరిత్రలో దాగిన సత్యాలు ఇవీ!

Indian history hidden truths: భారత రాజకీయాల్లో ’చొరబాటుదారులు’ పదం ఒక ఆయుధంగా మారింది. హిందుత్వవాదులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, వీరిని విదేశీయులుగా చిత్రీకరిస్తూ భయం పొందిస్తున్నారు. ఈ వాదన చరిత్రను ఏకపక్షంగా వక్రీకరిస్తూ, సమాజంలో విభజనను తీవ్రతరం చేస్తోందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ ఇక్కడే పుట్టి పెరిగినవారు కూడా చొరబాటుదారుల జాబితాలోకే వస్తున్నారు. ఈ తరుణంలో అసలు చొరబాటుదారులు ఎవరు అన్న ప్రశ్నలు పదే పదే తలెత్తుతున్నాయి.

రాజకీయ ఆయుధంగా చరిత్ర
ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ’సంపద పంచడం, మంగళసూత్రాలు దోచడం’ అంటూ ముస్లింలపై దాడి చేస్తారు. అమిత్‌ షా వంటి నాయకులు జనాభా పెరుగుదలను చొరబాటుకు ఆపాదిస్తూ, దేశభద్రతను ప్రశ్నిస్తున్నారు. ఇది చారిత్రక వాస్తవాలను విస్మరించి, ద్వేషాన్ని పెంచుతుంది.

మొదటి ఆక్రమణ..
క్రీ.పూ. 1500లో మధ్య ఆసియా స్టెప్పీల నుంచి ఆర్య యోధులు భారతానికి వచ్చి, స్థానిక సింధు నాగరికతపై ఆధిపత్యం సాధించారు. జెనెటిక్‌ అధ్యయనాలు, హాప్లోగ్రూప్‌ను బ్రాహ్మణుల్లో 72 శాతం వరకు, దళితుల్లో 16 శాతం, గిరిజనుల్లో 8 శాతం చూపిస్తాయి. వీరే వర్ణవ్యవస్థను రూపొందించి, సమాజాన్ని శాశ్వత విభజనలకు గురిచేశారు.

రెండవ తరం..
క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ. 100 వరకు యవనులు, శకులు, పార్థియన్లు, కుషాణులు (కనిష్కుడు) ప్రవేశించారు. మనుస్మృతి వీరిని ’పతిత క్షత్రియులు’గా పేర్కొన్నప్పటికీ, గాంధార కళ, బౌద్ధ ప్రచారంతో వీరు స్థానిక కులాల్లో (రాజపుత్రులు) కలిసిపోయారు. ఇది భారత సంస్కృతి వైవిధ్యానికి మూలం.

మూడవ దశలో ఇస్లామిక్‌ సామ్రాజ్యాలు..
12వ శతాబ్దం నుంచి ఐబక్, ఖిల్జీలు, మొఘలులు (బాబర్‌ 1526) ఉత్తర భారతాన్ని ఏకీకృతం చేశారు. ఔరంగజేబు అశోక సామ్రాజ్యంతో సమాన విస్తీర్ణాన్ని చేర్చాడు. అక్బర్‌ దీన్‌–ఇ–ఇలాహీతో మతసమన్వయాన్ని ప్రోత్సహించాడు. 1857 తిరుగుబాటుతో ముఘల్‌ పతనం సంభవించింది. ఈరోజు ముస్లింలు 700 సంవత్సరాలుగా భారతీయులే. చాలామంది దళిత మూలాల నుంచి మారినవారు.

ఎవరు చొరబాటు దారులు?
ఆర్యులు, యవనులు, ముస్లిములు భారతదేశంలోకి చొరబాటుదారులుగా వచ్చినప్పటికీ, వారు స్థానిక సంస్కృతులతో కలిసిపోయి, భారతీయ సమాజ బహుళతను రూపొందించారు. ఆర్యులు బ్రాహ్మణ సమాజంలో ఎక్కువగా ఉన్నట్లు జన్యు ఆధారాలు చెబుతున్నాయి. యవనులు శకులు, కుషాణులు ఉత్తరభారత రాజపుత్రులుగా ఈ దేశ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు. మధ్య ఆసియానుంచి వచ్చిన ముస్లిములతోపాటు స్థానిక దళిత, బహుజన సమూహాల నుండి ఇస్లాంలోకి మారినవారై ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది. నేటి రాజకీయ సందర్భంలో, ‘‘చొరబాటుదారులు’’ అనే పదం ముస్లిములను లక్ష్యంగా చేస్తూ, వారిని విదేశీయులుగా చిత్రీకరించడానికి ఉపయోగించబడుతుంది. ఇది చరిత్రను ఏకపక్షంగా వక్రీకరించే ప్రయత్నం, ఎందుకంటే ఇది ఆర్యులు, యవనులు, శకులు ఇతర జాతుల చొరబాట్లను విస్మరిస్తుంది.

‘‘చొరబాటుదారులు’’ అనేది చారిత్రక సంఘటనలను వివరించే పదం, కానీ ఆధునిక సమాజంలో దీనిని విభజనాత్మక రాజకీయాలకు ఉపయోగించడం తప్పుదారి పట్టిస్తుంది. విభజన, ద్వేషం కాకుండా ఐక్యత సామరస్యం వైపు మనం ప్రయాణం చేయాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version