Homeజాతీయ వార్తలుBJP Tamil Nadu political strategy: బిజెపి ఆలోచనలో తప్పేముంది.. తమిళనాడు మరో మహారాష్ట్ర అయితే.....

BJP Tamil Nadu political strategy: బిజెపి ఆలోచనలో తప్పేముంది.. తమిళనాడు మరో మహారాష్ట్ర అయితే.. సీఎం అయ్యేది అతడే..

BJP Tamil Nadu political strategy: రాజకీయాలలో నీతి అనేది ఉండదు. ధర్మం అనేది అంతకంటే ఉండదు. అధికారాన్ని దక్కించుకున్నాదామా.. పరిపాలన సాగించామా.. అనేదే ముఖ్యం. అందువల్లే రాజకీయాలలో అధికారం దక్కుతుందనేసరికి బద్ధ శత్రువుల లాంటి పార్టీలు కూడా ఏకమై పోతాయి. అప్పటిదాకా తిట్టుకున్న వాళ్లంతా కలిసిపోతారు. ఐక్యత రాగాలు ఆలపిస్తారు.

మనదేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఇటువంటి రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో అత్యంత కీలకమైన తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు ఈ తరహా రాజకీయాలకు బీజం పడుతోంది. మనదేశంలో మహారాష్ట్రలో శివసేన ను రెండుగా చీల్చి ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అందరికీ తెలుసు. ఇప్పుడు అటువంటిదే తమిళనాడు రాష్ట్రంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ పార్టీలో కీలక నాయకుడైన వి ఎస్ బాబు చుట్టూ తమిళనాడు రాజకీయం తిరుగుతోంది.

మెజారిటీ మీడియా దీనిని పట్టించుకోకపోయినప్పటికీ.. కొంతమంది విశ్లేషకులు మాత్రం వీకే బాబు చుట్టూ తమిళనాడు రాజకీయాలు తిరుగుతాయని చెబుతున్నారు. వీకే బాబు స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రిని ఓడించారు. ఆయన రాజకీయ నేపథ్యం కూడా విజయ్ కంటే చాలా బలమైనది. తన నియోజకవర్గం లో విజయ్ ప్రచారానికి రాకపోయినప్పటికీ.. బాబు తన చాకచక్యంతో విజయం సాధించారు..

ఒకవేళ ఈ సమయానికి విజయ్ ప్రభుత్వం గనుక ఏర్పడితే బాబు క్యాబినెట్ మినిస్టర్ గా ఉండేవారు. కానీ ఒక ముఖ్యమంత్రిని ఓడించిన ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా ఎందుకు ఉండాలి.. ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనేది ఇక్కడ చర్చ. ఒకవేళ బిజెపి గనుక బాబుతో కలిసి సరైన రాజకీయ చదరంగం గనుక ఆడితే అప్పుడు తమిళనాడులో సరికొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎలాగూ ఏఐడీఎంకె బిజెపిలో ఉంది కాబట్టి.. గవర్నర్ కూడా వాళ్ళ వ్యక్తి కాబట్టి కచ్చితంగా వీకే బాబు కేంద్రంగా తమిళనాడు రాజకీయాలు నడిచే ఆస్కారం ఉంది.

ఒకవేళ బాబు గనుక ఏకనాథ్ షిండే లాగా మారిపోతే.. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవడానికి టీవీకే పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది బాబుకు అండగా ఉండాలి. 50 మంది ఎమ్మెల్యేలను బాబు గనుక తన వైపు తిప్పుకుంటే.. అప్పటికి పరిస్థితి మారిపోతుంది. డీఎంకే నేతలను వాడుకొని.. 30 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే.. ఏఐడీఎంకే ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు తమిళ రాజకీయాలు మరోవైపుగా మారిపోతాయి. అంతేకాదు ఎమ్మెల్యేల సంఖ్య కూడా 128 చేరుకుంటుంది.

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ కంటే ఇది చాలా ఎక్కువ. గవర్నర్ రెండుసార్లు విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళినప్పుడు తిరస్కరించారు. దాని వెనుక ఎన్డీఏ వ్యూహం దాగిపోయినట్టు కనిపిస్తోంది. విజయ్ ప్రజల్లో బలాన్ని సాధించినప్పటికీ.. సరైన స్థాయిలో రాజకీయాలు చేయలేకపోతున్నాడు. అందువల్లే ఎన్డీఏ మధ్యలో ప్రవేశించి.. బాబు ద్వారా ఇలాంటి ప్లాన్లు గనుక రూపొందిస్తే.. అప్పుడు రాజకీయాలు మరో విధంగా మారిపోతాయి..

అమిత్ షా ఇటువంటి రాజకీయాలను కొనసాగించడంలో అపర చాణక్యుడు. అతడు కనుక తన బుర్రకు మరోసారి పద్ధతిని పెడితే దక్కకుండా పోయిన తమిళనాడు వారి చేతుల్లోకి వెళుతుంది. ఆ తర్వాత ఎలాంటి కథ నడపాలో మోడీ షాకు తెలుసు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version