spot_img
Homeజాతీయ వార్తలుమోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?

నిన్నటి అఖిలపక్ష వీడియో సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. చైనాతో జరుగుతున్న ఘర్షణలో అన్ని పార్టీల నాయకులను విశ్వాసం లోకి  తీసుకోవటం అభినందించదగ్గ విషయం. ఇటువంటి సమయాల్లో అందరిని కలుపుకొని వెళ్ళటం ఎంతో అవసరం. దానికి తగ్గట్టుగానే అందరూ కూడా ప్రభుత్వం వెనక నిలబడటమే కాకుండా మోడీని అభినందించటం కూడా జరిగింది. ఒక్క సోనియా గాంధీ మాత్రమే భిన్న స్వరాన్ని వ్యక్తపరచింది. ఆమెకు మద్దత్తుగా ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా నిలబడలేదు. ఈ సమయంలో రాజకీయాలకు తావులేదనే సెలవిచ్చారు. ఇది శుభ పరిణామం. మహాభారతం లో ధర్మరాజు చెప్పినట్లు మాలోమాకు ఎన్ని తగాదాలున్నా      బయటివాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మేము 105 మందిమి ఒక్కటే . అదే సూత్రం , అదే వారసత్వం ఇప్పుడు కొనసాగాలి. దురదృష్టవశాత్తూ సోనియా గాంధీ ఆ లైన్ తీసుకోకపోవటం విచారకరం.

అంతవరకూ బాగానే వున్నా చివరలో మోడీ చేసిన తుది పలుకులు మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అమరవీరులకు జోహార్లు అర్పించటం, సైన్యాన్ని ప్రశంసించటం లాంటి మాటలు ఉత్తేజాన్నిఇచ్చినా రెండు వాక్యాలు అందరినీ ఒక్క నిముషం షాక్ కి గురిచేసినాయి. మన భూభాగం లోకి ఎవరూ చొరబడలేదని, ఇప్పుడూ ఎవరూ లేరని, మన భారత పోస్టు ని ఎవరూ స్వాధీనం చేసుకోలేదని చెప్పటం ఒకనిముషం నోట మాట రాలేదు. అదేసమయంలో మన జవాన్లు గట్టి జవాబిచ్చారని చెప్పినా ముందు మాటలే అందరి చెవుల్లో ఏదో వినరానిది విన్నట్లుగా అనిపించింది. ఆ షాక్ నుంచి తేరుకోవటానికి కొంచెం టైం పట్టింది.

నిజంగా చైనా మన  భూభాగం లోకి  చొచ్చుకు రాలేదా? రాకపోతే మన సైనికులు ఎందుకు బలిదానం చేసినట్లు? ఇది అందరి మదిలో కదిలాడే ప్రశ్న. వచ్చిన వారిని తిప్పికొట్టారని చెప్పటం వేరూ  , అసలు మన భూభాగం లోకి రాలేదని వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా వుంది. మోడీ అలా ఎందుకు మాట్లాడవలిసి వచ్చిందో అంతుబట్టటంలేదు. ఒకవేళ వ్యూహాత్మకంగా ప్రస్తుతం పరిస్థితిని శాంతపరచాలని అనుకున్నా మోడీకి అ అధికారం వుంది. మోడీ ఏం చేసినా దేశాహితం కోసమే చేస్తాడని అనుకుంటారు. కాబట్టి అంతవరకూ ఇబ్బందిలేదు. కానీ అలా వ్యాఖ్యానించి వుండాల్సింది కాదు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దులో రోడ్లు ఇతర మౌలిక సౌకర్యాలు త్వర త్వరగా నిర్మించటం, అధునాతన ఆయుధాలు, విమానాలు కొనటం , సైన్యం నైతిక బలాన్ని పెంచటం లాంటి అనేక చర్యలు చేపట్టిన మాట వాస్తవం. అంతమాత్రాన ఇలా మాట్లాడటం మింగుడుపడటం లేదు. దేశప్రజలందరికీ మోడీ పై పూర్తి విశ్వాసం వుంది. ఈ తరుణంలో ఇటువంటి మాటలు ప్రజల స్థైర్యాన్ని , నైతిక బలాన్ని దెబ్బ తీస్తాయి. ఇలా మాట్లాడి వుండాల్సింది కాదు. ఏదేమైనా ఇది దేశ ప్రజలకి పెద్ద షాకే.

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version