కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కరోనా నివారణ చర్యల తో పాటు ప్రజల్ని కాపాడుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మేఘాలయా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారని అక్కడి పేపర్ క్లిపింగ్ లతో సహా ట్వీట్ చేశారు.
65 ఏళ్ళ వయస్సున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గ్రౌండ్ లెవల్ లో పని చేస్తున్నారు. 65 ఏళ్ళ వయస్సున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి క్షేత్ర స్థాయి లో పని చేస్తున్నారని తెలిపారు.
61 ఏళ్ళ వయస్సు ఉన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ గ్రౌండ్ లెవల్ లో తిరుగుతూ రైతుల కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారని, మేఘాలయా ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలకు సహాయం అందిస్తున్నార పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గ్రౌండ్ లో పని చేస్తున్నారన్నారు. 77 ఏళ్ళ వయస్సున్న కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్షేత్ర స్థాయిలో ఉండి కరోనా పై పోరాటం చేస్తున్నారని తెలిపారు. మరి యువ ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే,ఆంధ్రప్రదేశ్ సీఎం.జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదంలో నుంచి బయటకు రారా అని ప్రశ్నించారు. రాజకీయమే ఆయనకి ముఖ్యమా అనేది చెప్పాలన్నారు. ఏపీ సీఎం మిస్సింగ్ అని ట్వీటర్ లో పోస్టు చేశారు.