ప్రధాని మోడీ సడెన్ గా హైదరాబాద్ టూర్ వెనుక కారణమేంటి?

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ, టీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ నెలకొన్న ఈ సమయంలో దేశ ప్రధాని, బీజేపీ పెద్దాయన నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రచారంలో పాల్గొంటారా..? లేదా..? అనేది ఆసక్తి రేపుతోంది. Also Read: ‘గ్రేటర్’ వార్: టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే! హైదరాబాద్ వచ్చే ముందు రోజున అంటే నవంబర్ 28వ తేదీన ప్రధాని పుణె నగరానికి వెళ్ళనున్నారు. అక్కడి సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందుతున్న […]

Written By: NARESH, Updated On : November 26, 2020 7:40 pm
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ బీజేపీ, టీఆర్ఎస్ తో టఫ్ ఫైట్ నెలకొన్న ఈ సమయంలో దేశ ప్రధాని, బీజేపీ పెద్దాయన నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ప్రచారంలో పాల్గొంటారా..? లేదా..? అనేది ఆసక్తి రేపుతోంది.

Also Read: ‘గ్రేటర్’ వార్: టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ ప్లాన్ ఇదే!

హైదరాబాద్ వచ్చే ముందు రోజున అంటే నవంబర్ 28వ తేదీన ప్రధాని పుణె నగరానికి వెళ్ళనున్నారు. అక్కడి సీరం ఇనిస్టిట్యూట్‌లో రూపొందుతున్న వ్యాక్సిన్‌పై కూడా ప్రధాని సమీక్ష జరపనున్నారు. వ్యాక్సిన్‌ మంచి చెడ్డలను వాకబు చేసేందుకు తలపెట్టిన పర్యటనల్లో భాగంగానే ప్రధాని మోదీ.. మొదట పుణెకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల మంటలు రగులుకున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకుల రాకను గులాబీ నేతలు తప్పుపడుతున్నారు. అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా జీహెచ్ఎంసీ ప్రచారానికి స్థానిక నేతలు పిలుచుకు వస్తారంటూ తెలంగాణ మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నట్లు హఠాత్తుగా పర్యటన ఖరారైంది. దాంతో స్థానికంగా మోదీ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది.

Also Read: బీ సేఫ్‌.. కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

సడెన్ గా హైదరాబాద్ టూర్ పెట్టుకున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ బీజేపీ పెద్దాయన జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అనూహ్యంగా హైదరాబాద్ వస్తుండడం కలకలం రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల చివరి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భాగ్యనగరానికి రానున్నారు. దాంతో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడుతోంది. మోదీ పర్యటనలో ఒక్క మాట మాట్లాడినా అది గ్రేటర్ ఎన్నికల ప్రచారానికేనని అభిప్రాయం కలిగే సంకేతాలున్నాయి.

కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ప్రధాన మంత్రి మోడీ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. 29న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీం పేటకు వస్తారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తరుపున ప్రముఖులు ప్రచారానికి వస్తున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్