జగన్‌ మౌనం వెనుక ఆంతర్యం ఏంటో..?

ఒక రాజకీయ నేత మౌనం వెనుక ఏదో పరమార్థం ఉంటుంది. ఆ మౌనం ఎందుకు వహించాల్సి వచ్చిందో తర్వాత తర్వాత తెలుస్తుంటుంది. ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఎందుకో మౌనం పాటిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో వైసీపీ నాయకులు కట్టుతప్పుతున్నా.. ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నా మిన్నకుండిపోతున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు స‌హ‌నం కోల్పోయి సొంత పార్టీ నేత‌ల‌పైనే విమర్శలు సంధిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Also Read: పవన్‌ను కలిసిన రెడ్డయ్య యాదవ్‌.. షాక్‌లో వైసీపీ […]

Written By: Srinivas, Updated On : December 3, 2020 11:45 am
Follow us on


ఒక రాజకీయ నేత మౌనం వెనుక ఏదో పరమార్థం ఉంటుంది. ఆ మౌనం ఎందుకు వహించాల్సి వచ్చిందో తర్వాత తర్వాత తెలుస్తుంటుంది. ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఎందుకో మౌనం పాటిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో వైసీపీ నాయకులు కట్టుతప్పుతున్నా.. ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నా మిన్నకుండిపోతున్నారు. అంతేకాదు.. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు స‌హ‌నం కోల్పోయి సొంత పార్టీ నేత‌ల‌పైనే విమర్శలు సంధిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: పవన్‌ను కలిసిన రెడ్డయ్య యాదవ్‌.. షాక్‌లో వైసీపీ శ్రేణులు

అయితే ఇదంతా చూస్తూ జ‌గ‌న్ ఎందుకు ఊరుకుంటున్నారనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. కానీ.. కొంద‌రు మాత్రం ఈ విష‌యాల‌న్నీ జ‌గ‌న్ ప‌ట్టించుకోర‌ని.. ఆయ‌న‌కు తీరిక లేద‌ని చెప్పే ప్రయ‌త్నాలు చేసేవారు కూడా ఉన్నారు. వాస్తవం మాత్రం వేరేనట. కొన్నాళ్ల కింద‌ట చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మశ్రీ.. పార్టీ ప్రధాన కార్యద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో ప‌రుషంగా మాట్లాడారు. విశాఖ‌లో అవినీతి జ‌రుగుతోంద‌ని.. ఆ అవినీతి చేసేవారిలో ఇక్కడ నేత‌లు ఉన్నార‌ని సాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన‌ప్పుడు ధ‌ర్మశ్రీ.. ఎవ‌రో పేర్లు చెప్పాల‌ని.. లేకుంటే కామెంట్లు మానుకోవాల‌ని గ‌ట్టిగానే చెప్పారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో నేరుగా అంద‌రినీ జ‌గ‌న్ తాడేప‌ల్లికి పిలిపించి.. పంచాయ‌తీ పెట్టారు. ఆ త‌ర్వాత‌.. సాయిరెడ్డితోనూ జ‌గ‌న్ స్వయంగా మాట్లాడారు. అయితే.. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ ఏం చెప్పారు. పార్టీ నేత‌ల‌కు ఎలాంటి సూచనలు చేశారనేది తెలియలేదు.

అయితే.. తాజాగా సాయిరెడ్డి మ‌రోసారి విశాఖ న‌గ‌ర నాయ‌కులు, ఎమ్మెల్యేల‌తో ప్రైవేటుగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సాయి రెడ్డి చేసిన కామెంట్లు.. కొంద‌రు నాయ‌కులు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా లీక్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి.. ‘జ‌గ‌న్ మ‌న పార్టీ వాళ్లంద‌రికీ కూడా స్వేచ్ఛ ఇచ్చారు. ఆయ‌న ఎవ‌రిపైనా ఒత్తిడి చేయ‌డం లేదు. చేయరు కూడా. మీరే ప్రజ‌ల‌తో మ‌మేకం కావాలి. ఏం కావాలో ప్రభుత్వాన్ని అడ‌గండి. మీ ర్యాంకును మీరే పెంచుకోండి. ప్రజ‌ల్లో మీరు మైన‌స్ అవుతున్నట్టు క‌నిపిస్తే ప్రభుత్వానికి నివేదిక‌లు అందితే.. మీప్లేస్‌లు మారిపోయి.. కొత్తవారికి ఛాన్స్‌లు ఇస్తారు. ఇదే జ‌గ‌న్ నిర్ణయం’ అని సాయిరెడ్డి కుండ‌బ‌ద్దలు కొట్టార‌ట‌.

Also Read: నారా లోకేష్ షాకింగ్ లుక్.. ఇలా అయ్యాడేంటి?

రాష్ట్రంలో సొంత పార్టీలోనే ఇంత జరుగుతున్నా.. ఓ వైపు లీడర్లు కొట్టుకుంటున్నా.. తిట్టుకుంటున్నా జగన్‌ మౌనంపై సర్వత్రా చర్చలు వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో చాలా మంది మంత్రుల‌పై అనేకానేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా జ‌గ‌న్ చూస్తూ ఊరుకోవ‌డం వెన‌క కూడా మ‌రో 9 నెల‌ల్లో వారిని నిర్దాక్షిణ్యంగా ప‌క్కన పెట్టేయాల‌ని డిసైడ్ అవ్వడ‌మే కార‌ణం అంటున్నారు. ఏదిఏమైనా ఓ వైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే.. మరోవైపు పార్టీని కూడా గాడిలో పెట్టాల్సిన బాధ్యత జగన్‌దే కదా. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మొదటికే మోసం వచ్చే ప్రమాదమే ఉందనేది స్పష్టం.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్