బీజేపీ మౌనం వెనుక అర్థం ఏంటీ..?

రాజకీయాల్లో ప్రభుత్వం.. ప్రతిపక్షం కామన్‌. ఒక్కో పార్టీ ఒక్కో స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఏపీలోని వైసీపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీ, టీడీపీలు ఆ రాష్ట్రంలో సై అంటే సై అంటున్నాయి. ఇక మరో పార్టీ బీజేపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా పెద్దగా లెక్కచేయడం లేదు. అయితే.. దీనిపై పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. Also Read: లాయర్లను బెదిరిస్తారా? ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్‌‌ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా […]

Written By: NARESH, Updated On : October 8, 2020 1:56 pm
Follow us on

రాజకీయాల్లో ప్రభుత్వం.. ప్రతిపక్షం కామన్‌. ఒక్కో పార్టీ ఒక్కో స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఏపీలోని వైసీపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీ, టీడీపీలు ఆ రాష్ట్రంలో సై అంటే సై అంటున్నాయి. ఇక మరో పార్టీ బీజేపీపై ఎన్ని విమర్శలు చేస్తున్నా పెద్దగా లెక్కచేయడం లేదు. అయితే.. దీనిపై పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: లాయర్లను బెదిరిస్తారా? ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్‌‌

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల నియామకం అయిన సోము వీర్రాజు మాటకారి అనే చెప్పొచ్చు. ఆయ‌న ఏ విష‌యంపై మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ఆయన ఎవ‌రినీ వ‌దిలి పెట్టరు. గ‌తంలో చంద్రబాబును, కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను కూడా విమ‌ర్శించి.. రాజ‌కీయంగా చ‌ర్చకు తెర‌దీశారు. అయితే, ఇప్పుడు అదే వైసీపీ నుంచి విమ‌ర్శలు వ‌స్తుంటే.. మాత్రం మౌనం దాలుస్తున్నారు. ఇటీవ‌ల తిరుమ‌ల డిక్లరేష‌న్ వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో రాష్ట్రంలో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను కూడా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు.

ఇటీవల ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు సైతం పెరిగాయి. ముఖ్యంగా అంతర్వేది ఘటనపై బీజేపీ సీరియస్‌గా స్పందించింది. ఏకంగా దీక్షలు కూడా చేపట్టింది. దీనికితోడు తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వెళ్లిన సీఎం జగన్‌ నుంచి డిక్లరేషన్‌ కోసం పట్టుబట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు రెచ్చిపోయారు. ఈ క్రమంలో అనూహ్యంగా రంగంలోకి దిగిన వైసీపీ ఫైర్ బ్రాండ్‌, మంత్రి కొడాలి నాని.. అటు మోడీని, ఇటు సోము వీర్రాజును కూడా టార్గెట్ చేశారు. సోము ఓ ప‌ది మందిని వేసుకుని వెళ్లి అమిత్ షాను మార్చమంటే మారుస్తారా ? అని ప్రశ్నించారు. అంత‌టితో ఆగ‌కుండా ‘సోము రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాతే దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. దీనిని బ‌ట్టి ఆయ‌న‌ను అనుమానించాల్సి వ‌స్తోంది’ అంటూ బాంబు పేల్చారు.

Also Read: విద్యార్థులకు జగనన్న కానుక ఇదీ..

ఈ విషయంలో బీజేపి కింది స్థాయి లీడర్ల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. పైగా రాష్ట్ర వైసీపీ కూడా మోడీని ఎవ‌రూ ఏమ‌నొద్దని చెప్పిందే త‌ప్ప.. సోము విష‌యంలో మాత్రం ఎవ‌రినీ కంట్రోల్ చేయ‌లేదు. అంటే అటు బీజేపీ ప‌రంగా సోమును కాపాడే వారు క‌నిపించ‌క‌పోగా వైసీపీ కూడా ఎవ‌రినీ ఏమీ అన‌లేదు. ఇదిలావుంటే, తాజాగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా బీజేపీ నేత‌ల‌పై దూకుడు ప్రద‌ర్శించారు. బీజేపీ జాతీయ కార్యద‌ర్శిగా ప‌గ్గాలు చేప‌ట్టిన పురందేశ్వరిని ఉద్దేశించి ‘ఆమె జాతి నాయ‌కురాలు’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆమె అమ‌రావ‌తి విష‌యంలో మాట్లాడిన మాట‌ల‌కు కౌంట‌ర్‌గా విజ‌య‌సాయి ఏకంగా ఆమె కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గమే క‌దా.. అనే ధోర‌ణిలో తీవ్ర వ్యాఖ్యలే చేశార‌ని చెప్పాలి. అయినా.. బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్‌ కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మోడీతో జగన్ కలిశారు. ఈ క్రమంలోనే వైసీపీతో బీజేపీ బంధంపై మరోసారి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో వైసీపీ చేరికపై చర్చలు మొదలైనట్టు కనిపిస్తోంది. దీంతో కేంద్రమే రాష్ట్ర బీజేపీ నేతలను మౌనంగా ఉండాలని సూచిస్తోందా..? లేక వైసీపీ సర్కార్‌‌తో విభేదాలు సృష్టించొద్దు అని చెబుతోందా..? అనేది తెలియకుండా ఉంది. ఏది ఏమైనా బీజేపీ మాత్రం డ్యూయల్‌ రోల్‌ పోషిస్తున్నట్లే కనిపిస్తోంది.