Homeఆంధ్రప్రదేశ్‌Margadarsi Case: మార్గదర్శి కేసులో రామోజీని జగన్ ఏం చేయలేడా?

Margadarsi Case: మార్గదర్శి కేసులో రామోజీని జగన్ ఏం చేయలేడా?

Margadarsi Case: ఇప్పటికే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా మారితే లోకేష్ కూడా జైలుకు వెళ్తాడు. అంటే జగన్ స్కెచ్ చాలా గట్టిగానే ఉందన్నమాట. అయితే చంద్రబాబుకు ఉన్న శక్తుల్లో రామోజీరావు ఒకడు. అయితే ఈ రామోజీరావును దెబ్బ కొట్టేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కుదుపు కుదిపినప్పటికీ రామోజీరావు వెంటనే చేరుకున్నాడు. వైయస్ మరణం తర్వాత రామోజీరావును ఏ రాజకీయ నాయకుడు కూడా ఏమి చేయలేకపోయాడు. ఏపీలో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు రామోజీరావును జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాతే రామోజీరావు మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టాడు. అగ్నికి వాయువు తోడైనట్టు జగన్మోహన్ రెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ తోడు కావడంతో రామోజీరావుకు ఉక్కపోత మొదలైంది.

సహజంగానే రామోజీరావుకు మార్గదర్శి ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. అతడి గ్రూపు సంస్థల్లో మార్గదర్శి విపరీతమైన లాభాల్లో ఉంది. అయితే ఇందులో ఉన్న అవకతవకలను ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా తెలివిగా పసిగట్టి కోర్టుకు లాగాడు. ఎలాగూ చంద్రబాబుకు రామోజీరావు ప్రధాన ఆర్థిక స్థంభం కాబట్టి ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు. ఇక అప్పటినుంచి మార్గదర్శి మీద దూకుడు మొదలుపెట్టాడు. అసలు రామోజీరావు అంటేనే కాలాతీతమైన వ్యక్తి అని భావించే పరిస్థితులను ఒక్కసారిగా జగన్ మార్చేశాడు. తాను బంగారపు సింహాసనం మీద కూర్చుని మిగతా వారిని మామూలు కుర్చీల్లో కూర్చోబెట్టే రామోజీరావును జగన్ ఏకంగా పడుకోబెట్టాడు. సిఐడి అధికారులతో పలు దఫాలుగా విచారణ నిర్వహించాడు. అంతేకాదు ఏపీలో మార్గదర్శి వ్యాపారాన్ని దాదాపుగా మూసే ప్రయత్నం చేశాడు. ఇక్కడితో జగన్ ఆగలేదు.

అయితే మార్గదర్శి సంస్థకు సంబంధించి వ్యాపార భాగస్వామి అయినా యూరి రెడ్డి మీద రామోజీరావు దౌర్జన్యానికి పాల్పడ్డాడని తాజాగా ఒక కేసు నమోదు అయింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి కేవలం సాక్షి మీడియాలో మాత్రమే వార్తలు ప్రసారమయ్యాయి. మిగతా మీడియాలో దీని గురించి ప్రస్తావన కూడా రాలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో టాప్ 2 చానల్స్ గా చెప్పుకునే ఎన్టీవీ, టీవీ9 లో వాటి గురించి ప్రస్తావనే లేదు. రామోజీరావు విషయంలో మిగతా చానల్స్ కూడా సానుభూతి ప్రకటిస్తున్నాయని అనుకోవాలి. అయితే యూరి రెడ్డి పెట్టిన కేసు ద్వారా తనకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రామోజీరావు కోర్టుకు వెళ్ళాడు. కోర్టు కూడా రామోజీరావు చెప్పిన దాన్ని విన్నది. వచ్చే నెల వరకు ఆయనకు వెసులుబాటు కల్పించింది. అంతే కాదు పోలీసులు తదుపరి అడుగులు వేగంగా వేయకుండా ఉండేందుకు బ్రేకులు వేసింది. సహజంగానే ఈ పరిణామం రామోజీ మోములో హర్షం వికసించేలా చేసింది. రామోజీరావు ప్రధాన ఆర్థిక వనరు మార్గదర్శి ని ఏమి చేయకుండా జగన్ దూకుడుకు బ్రేక్ వేసింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది?

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
Oktelugu Epaper
Exit mobile version