గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మే 4న సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆమె నందిగ్రామ్ లో ఆమె సువేందు అధికారి చేతిలో పరాభవం చెందారు. దీంతో ఆమెకు కలిసొచ్చే భవానీపూర్ కాకుండా నందిగ్రామ్ వెళ్లడంతో పరాజయం పాలైనట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈనెల 30న ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గత ఎన్నికల గుణపాఠంతో మమతా బెనర్జీ మళ్లీ భవానీపూర్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. భవానీపూర్ లో ఎమ్మెల్యేను రాజీనామా చేయించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మమత ఎమ్మెల్యేగా విజయం సాధించకపోతే ఆమె సీఎం పీఠం నుంచి వైదొలగాల్సిందే. అందుకే ఆమెకు ఈ ఎన్నిక డూ ఆర్ డై గా మారనుంది. ఎలాగైనా విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.
భవానీపూర్ లో ఉప ఎన్నికపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా బాధ్యులను నియమించుకుంటున్నారు. విజయం కంటే మెజార్టీ పై నే దృష్టి పెడుతున్నారు. అత్యధిక మెజార్టీ సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. దీంతో కార్యకర్తలపైనే పూర్తి బాధ్యతలు పెడుతున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు మొదలు పెడుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడిపోయారు.