spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Minister Dharmana Prasada Rao: విజయవాడకు ఆక్సెప్టబుల్ కల్చర్ లేదు అందుకే రాజధానిగా పనికిరాదు... మంత్రి...

Minister Dharmana Prasada Rao: విజయవాడకు ఆక్సెప్టబుల్ కల్చర్ లేదు అందుకే రాజధానిగా పనికిరాదు… మంత్రి ధర్మాన

Minister Dharmana Prasada Rao: మూడు రాజధానుల వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదివరకే దీనిపై ఉద్యమాలు నడుస్తున్నా నేతల్లో మాత్రం మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది. అమరావతి రాజధాని అయితే ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబుకు రాష్ట్రంపై ప్రేమ లేదని విమర్శించారు. ఒక అమరావతిపైనే ప్రేమ చూపించడంతో అన్ని ప్రాంతాలు అట్టడుగున ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరోమారు మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.

Minister Dharmana Prasada Rao
Minister Dharmana Prasada Rao

ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ కాలేదని కొందరి వాదన. దీంతోనే మూడు రాజధానుల ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. రాజధాని కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయని వాదిస్తున్నారు. దీంతోనే మూడు రాజధానుల ప్రస్తావన సీఎం జగన్ తీసుకొచ్చినట్లు నేతలు పేర్కొంటున్నారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం దక్కాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ మేరకు చర్యలు తీసుకోవాలని భావించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఒక అమరావతి గురించే పట్టించుకున్నారు కానీ మిగతా ప్రాంతాల ఊసే ఎత్తలేదు.

దీంతోనే మూడు రాజధానుల కోసం పట్టుపడుతున్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తాము పోరాటం చేస్తున్నామని గుర్తు చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం అక్కడి రైతులు పాదయాత్ర చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మూడు రాజధానుల కోసమే మొగ్గు చూపుతున్నట్లు చెప్పడం గమనార్హం. దీని కోసం కూడా ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసమే మూడు రాజధానుల విషయమై నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు తమ సమస్యలను పట్టించుకోలేదంటున్నారు.

Minister Dharmana Prasada Rao
Minister Dharmana Prasada Rao

జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి కనిపించాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రస్తావన తెస్తున్నా దాన్ని ముందుకు సాగనీయడం లేదు. ఒకపక్క కోర్టు అక్షింతలు వేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరించడం ఆందోళనలకు తావిస్తోంది. అమరావతిలో కొందరి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం ఇంకా ఎన్ని పోరాటాలైనా చేయడానికి తాము సిద్ధమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper