Ek Number News : తెలుగు రాష్ట్రాలే కాదు.. జాతీయం, అంతర్జాతీయ స్థాయిలో ‘ఏక్ నంబర్’ న్యూస్ ను మీ ముందుకు పట్టుకువచ్చాం. ఈరోజు కొందరు నేతలు సరదాగా వ్యవహరిస్తే.. మరికొందరు కామెడీ పండించారు. ఇంకొందరు ఎమోషనల్ గా స్పందించారు. అలాంటి వార్తలన్నీ కలగలిపి ఈరోజు ఓకే తెలుగు మీ ముందుకు తీసుకువస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య సంగతి తెలుసుకదా.. ఆయన మాటలే కాదు.. చేష్టలు కూడా కామెడీనే. పాత వరంగల్ జిల్లాలో ఓ తాటి చెట్లలకు పోయి గౌడ్ పోసే కల్లు చప్పరిస్తూ చేదుగా అయిపోయేసరికి వింత వింత ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేశాడు.
భద్రాచలం గుడిలో లడ్డూల తీరు తీవ్ర నాసిరకంగా ఉంది. పాచిపెట్టినా.. బూజు పట్టిన లడ్డూలను అమ్ముతూ భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నారు.
ఇక విజయశాంతి ఈసారి కూడా మళ్లీ ట్వీట్లతో రెచ్చిపోయింది. బీజేపీలో ఉన్న ఆమె కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఆమె బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మన ఏక్ నంబర్ న్యూస్ లో చూద్దాం..