Homeజాతీయ వార్తలుUP Hamirpur Bridge Collapse: హోరుగాలికి వంతెన కుప్పకూలిపోయింది.. చూస్తుండగానే ఆరుగురి ప్రాణాలు..

UP Hamirpur Bridge Collapse: హోరుగాలికి వంతెన కుప్పకూలిపోయింది.. చూస్తుండగానే ఆరుగురి ప్రాణాలు..

UP Hamirpur Bridge Collapse: అది మామూలు గాలి కాదు. ప్రచండమైన గాలి.. విపరీతమైన వేగంతో దూసుకొచ్చింది. దూసుకురావడమే కాదు, పెను ఉత్పాతాన్ని సృష్టించింది. ఆ గాలి తాకిడికి చిన్న చిన్న వస్తువులు కాదు, పెద్ద పెద్ద హోర్డింగులు చిగురుటకులా వణికి పోయాయి. విరిగిపోయి గాలిలో తేలియాడాయి. ఆ గాలి అక్కడితోనే ఆగిపోలేదు. ఆ స్థాయి నష్టం తోనే ఆగిపోలేదు. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఘోరమైన నష్టానికి కారణమైంది.

ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీకరమైన గాలులు వీచాయి. విపరీతంగా వర్షం కురిసింది. ఈ దారుణమైన ఘటన వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు. అయితే ఈ సంఘటనలను మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్పూర్ జిల్లాలోని బెత్వ నది మీద నిర్మిస్తున్న వంతెన హోరుగాలి తాకిడికి కూలిపోయింది. గాలి తాకిడికి బ్రిడ్జి మొత్తం ఊగిపోయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు కన్నుమూశారు. అర్ధరాత్రి సమయంలో గాలి విపరీతంగా రావడంతో.. ఆ వేగానికి వంతెన ఊగిపోయి కూలిపోయింది. దీంతో గాడ నిద్రలో ఉన్న ఆరుగురు కార్మికులు చనిపోయారు.

కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఆ వంతెన ఈదురు గాలుల వల్ల ఊగిపోయి కూలిపోయింది. ముందుగా గడ్డర్లు ఊగిపోయాయి. ఆ తర్వాత ఐరన్ సామాగ్రి నేల కూలింది. దీంతో కార్మికులు నిద్రలోనే వాటి కింద పడిపోయి కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. గాలుల తీవ్రత వల్ల నష్టం అపారంగా చోటుచేసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడు కూడా వేసవికాలంలో ఈ స్థాయిలో ఈదురుగాలులు వీచలేదు. వర్షాలు కురియలేదు. ఈసారి మాత్రమే భిన్నంగా పరిస్థితి ఉంది. దీనివల్ల ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణనష్టం కూడా విపరీతంగా చోటు చేసుకుంటున్నది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల ఉపరితలం విపరితంగా వేడెక్కిందని.. దానివల్ల వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. అందువల్లే ఇలా వర్షాలు.. గాలులు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.. సాధ్యమైనంతవరకు ఈదురుగాలులు వీస్తున్నప్పుడు ఆరుబయట నిద్రపోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular