spot_img
Homeజాతీయ వార్తలుUP by-election : యూపీ ఉప ఎన్నికల్లో హోరాహోరి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే.....

UP by-election : యూపీ ఉప ఎన్నికల్లో హోరాహోరి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే.. సర్వే సంస్థలు చెప్పిన ఫలితాలివీ..

UP by-election : అధికార భారతీయ జనతా పార్టీ నాలుగు నుంచి ఆరు స్థానంలో గెలిచే అవకాశం ఉందని ప్రముఖ సర్వే సంస్థ డీఎన్ఏ వెల్లడించింది. విపక్ష సమాజ్ వాదీ పార్టీ మూడు నుంచి ఐదు స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది.. సమాజ్ వాదీ పార్టీ నుంచి నలుగురు, భారతీయ జనతా పార్టీ నుంచి ముగ్గురు, రాష్ట్రీయ లోక్ దళ్ , ఆర్ఎల్డీ, నిషాద్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో మొత్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 9 అసెంబ్లీ స్థానాలకు ఖాస్ళీ ఏర్పడింది. ఫలితంగా ఆస్థానాలలో ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించింది. ఈ ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు నుంచి ఆరు స్థానాల్లో గెలుస్తుందని, సమాజ్ వాదీ పార్టీ మూడు నుంచి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.

వినూత్న ప్రచారం..

ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వినూత్నంగా ప్రచారం చేసింది. ఓ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడు పార్టీ కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. అయితే ఆ విందులో మటన్ ముక్కలు సరిగ్గా వేయకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. క్యాటరింగ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రముఖంగా ప్రస్తావించారు. బిజెపి నాయకులపై విమర్శలు చేశారు..” ఎన్నికల సమయంలో కార్యకర్తలను వాడుకుంటారు. కానీ వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టరు. ఇలాంటి వ్యక్తులకు ఓట్లు ఎందుకు వేయాలి? ఇలాంటి వ్యక్తులకు అధికారం ఎందుకు ఇవ్వాలి? ఇందుకోసమేనా కార్యకర్తలు ఆ పార్టీ జెండాలు మోసేది” అంటూ ధ్వజమెత్తారు. అయితే అఖిలేష్ యాదవ్ ఇలా ప్రచారం చేసినప్పటికీ అంతిమంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తున్నదని తెలుస్తోంది. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తర్ ప్రదేశ్లో భారీగా సీట్లు కోల్పోయింది. ఇండియా కూటమి ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. దీంతో ముఖ్యమంత్రి యోగి పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన రంగంలోకి దిగారు. పార్టీలోని చీలికలను రూపుమాపారు. నాయకులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నారని సర్వే సంస్థలు చెబుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version