Extramarital affairs : భర్తలను మార్చుకున్న భార్యలు.. ఆ తర్వాతే అలసు ట్విస్ట్.. బీహార్ లో జరిగిన షాకింగ్ ఘటన

Extramarital affairs : సోషల్ మీడియా బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలల జరిగే ప్రతీ వింత సంఘటనని చూడాల్సి వస్తుంది.కొన్ని కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటే ‘ఛీ ఛీ ఇలాంటి సమాజం లో బ్రతుకుతున్నామా’ అని అనిపిస్తాది.రీసెంట్ గా బీహార్ లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇందుకు ఉదాహరణ గా తీసుకోవచ్చు. అసలు విషయానికి వస్తే బీహార్ లో రూబీ , దేవి అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.రూబీ నీరజ్ కుమార్ అనే అతనిని […]

Written By: NARESH, Updated On : March 2, 2023 9:31 pm
Follow us on

Extramarital affairs : సోషల్ మీడియా బాగా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలల జరిగే ప్రతీ వింత సంఘటనని చూడాల్సి వస్తుంది.కొన్ని కొన్ని సంఘటనలను చూస్తూ ఉంటే ‘ఛీ ఛీ ఇలాంటి సమాజం లో బ్రతుకుతున్నామా’ అని అనిపిస్తాది.రీసెంట్ గా బీహార్ లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇందుకు ఉదాహరణ గా తీసుకోవచ్చు.

అసలు విషయానికి వస్తే బీహార్ లో రూబీ , దేవి అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.రూబీ నీరజ్ కుమార్ అనే అతనిని 2009 లో పెళ్లాడింది.ఆమెకి దేవి అనే స్నేహితురాలు ఉంది, ఆమె భర్త పేరు ముఖేష్ కుమార్.ఈ రెండు జంటలు తరుచు కలుస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు.ఎక్కడైనా ఇది చాలా కామన్ అనే చెప్పొచ్చు.

కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే రూబీ ముఖేష్ కుమార్ మీద మనసు పడింది.అతను కూడా ఈమెని ప్రేమించాడు,తన భర్త నీరజ్ కుమార్ కి తెలీకుండా రూబీ,తన భార్య దేవి కి తెలియకుండా ముఖేష్ కుమార్ ప్రేమాయణం నడిపారు.మరోపక్క ముఖేష్ కుమార్ భార్య దేవి రూబీ భర్త నీరజ్ పై మనసుపడింది..వీళ్లిద్దరు కూడా ఒకరినొక్కరు గాఢం గా ప్రేమించుకున్నారు.

అయితే ఒక రోజు ముఖేష్ కుమార్ తన భార్య దేవి నీరజ్ కుమార్ తో కలిసి తిరగడం, ఫోన్ లో మాట్లాడుకోవడం, వాట్సాప్ లో రొమాంటిక్ చాట్ చేసుకోవడం ఇలాంటివన్నీ గమనించాడు.చిక్కింది ఛాన్స్ అని అనుకోని ముఖేష్ కుమార్ రూబీ తో తనకి ఉన్న రేలషన్ గురించి దేవి కి చెప్పి, ఆ తర్వాత నలుగురు ప్రశాంతం గా కూర్చొని మాట్లాడుకొని ఒకరి భర్తని ఒకరు మార్చుకున్నారు.ఫిబ్రవరి నెలలో వీళ్ళ పెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి.స్నేహితురాలి భర్తలపై మోజు పాడడం అనేదే నీచమైన చర్య , అలాంటిది నలుగురు ఒకే తప్పు చేసారు.ఈ సంఘటన ఇప్పుడు నేషనల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.