రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతకు కరోనా పాజిటివ్ అని తేలింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందని వైద్యులు వెల్లడిచారు.
నిజానికి ఆయన గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతూ వచ్చారు. దీంతో కరోనా టెస్ట్ చేయించుకోగా, అది పాజిటివ్ అని తేలిందని వైద్యులు ప్రకటించారు.
ఇతర రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కోవిడ్-19 బారిన పడినప్పటికీ తెలంగాణలో మాత్రం అలాంటి సంఘటనలు జరగలేదు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కరోనా బారిన పడి విజయవంతంగా కోలుకున్నారు.
అయితే, తమిళనాడు రాష్ట్రంలో మాత్రం విపక్ష డీఎంకేకు చెందిన చెప్పాక్కం నియోజకవర్గ ఎమ్మెల్యే జె. అన్బళగన్ కరోనా వైరస్ సోకి కన్నుమూసిన విషయం తెల్సిందే. దేశంలో కోవిడ్ వైరస్ సోకి చనిపోయిన తొలి ప్రజా ప్రతినిధి ఈయనే.