spot_img
Homeజాతీయ వార్తలుKTR: కేటీఆర్‌పై భగ్గుమంటున్న టీఆర్ఎస్ నేతలు.. అలా ఎందుకు చేశారు?

KTR: కేటీఆర్‌పై భగ్గుమంటున్న టీఆర్ఎస్ నేతలు.. అలా ఎందుకు చేశారు?

KTR: మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీ నేతలకు రుచించడం లేదని తెలుస్తోంది. ఆయన ఎందుకిలా చేస్తున్నారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట గులాబీ లీడర్లు.. నియోజకవర్గంలో కష్టపడి పని చేసేది మేము అయితే ఆ క్రెడిట్‌ను ప్రతిపక్ష పార్టీ ఖాతాలో వేయడం ఏంటిని ఫైర్ అవుతున్నారు. ఈ వియషంపై తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధం అవుతున్నారట.. బావమరిది తమకు అన్యాయం చేశాడని, అందుకే బావ దగ్గరకు వెళ్లేందుకు ఆ నేతలు సిద్ధంగా ఉన్నారట.. మంత్రి కేటీఆర్ అలా ఎందుకు ప్రవర్తించారో క్లారిటీ ఇచ్చాకే పార్టీ కోసం పనిచేస్తామని గట్టిగా చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. సొంత పార్టీ లీడర్లే కేటీఆర్ పై ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

KTR
KTR

ప్రత్యర్థి పార్టీ నేతతో దోస్తీయా..

మంత్రి కేటీఆర్ ఇటీవల సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ది కార్యకలాపాల్లో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు లాభం చేకూర్చలే మంత్రి కేటీఆర్ చేష్టలు ఉన్నాయని మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్‌ ఆరోపించారు. అంతేకాకుండా తనను జ‌గ్గారెడ్డితో క‌లిసి ప‌ని చేయాల‌ని కేటీఆర్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కేటాయిస్తే.. జగ్గారెడ్డి అసెంబ్లీలో కోరడం వల్లే మెడికల్ కాలేజీ ఇచ్చామని.. ఇచ్చిన కేసీఆర్ ఘనతను గుర్తించకుండా ఆ క్రెడిట్‌ను మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డి ఖాతాలో వేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సంగారెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు.

Also Read: కేంద్రంపై ఇలా ఫైట్ మొదలెట్టిన కేటీఆర్

అధిష్టానం వద్ద తేల్చుకోవాలని..

మంత్రి కేటీఆర్ సంగారెడ్డిలో పార్టీకి చేసిస డ్యామేజ్ విషయంలో అధిష్టానం వద్ద తేల్చుకోవాలని మాజీ ఎమ్మెల్యేతో పాటు గులాబీ లీడర్లు ఆలోచిస్తున్నారని తెలిసింది. కేటీఆర్ వ్యాఖ్యలతో తాము ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదీ కాకుండా పలు అభివృద్ధి కార్య‌క్ర‌మాలను త‌మ‌తో కాకుండా ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డితో శంకుస్థాప‌న చేయించ‌డం స్థానిక టీఆర్ఎస్ లీడర్లకు రుచించడం లేదని తెలిసింది. ఈక్రమంలోనే రెండ్రోజుల కింద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖ‌రికి నిలదీస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ‘చావు డ‌ప్పు’ కార్య‌క్ర‌మం చేపట్టింది. అయితే, జిల్లా మొత్తం ఈ కార్య‌క్ర‌మం జరిగినా సంగారెడ్డి టీఆర్ఎస్ లీడర్లు మాత్రం దూరంగా ఉన్నారు. కేటీఆర్ చేసిన డ్యామేజ్ వలన అలిగిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్ర‌భాక‌ర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని తెలిసింది. అయితే, తనకు ఆరోగ్యం బాలేదని అందుకే చావు డప్పు కార్యక్రమంలో పాల్గొనలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారట..

మంత్రి కేటీఆర్ సంగారెడ్డిలో ప్రత్యర్థి పార్టీ నేత జగ్గారెడ్డితో కలిసి రాసుకుని పూసుకుని తిరగడంపై మంత్రి హరీశ్ రావును కలవాలని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అండ్ కో భావిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ జగ్గారెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునే ప్రయత్నం అయితే తమ సంగతి ఏంటని కూడా గట్టిగా నిలదీయాలని అనుకుంటున్నారట.. ఈ విషయంపై సరైన క్లారిటీ వచ్చాక పార్టీలో ఉండాలా? లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని సంగారెడ్డి గులాబీ నేతలు చెబుతున్నారు. చివరగా తమ పార్టీ నేతలను బాగా చూసుకోవాలని మంత్రి కేటీఆర్ జగ్గారెడ్డికి చెప్పడాన్ని బట్టి జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారా? అనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ రేవంత్ వర్గం, ఆ పార్టీ సీనియర్లు మరో వర్గంగా చీలిపోయిన విషయం తెలిసిందే. అక్కడ జగ్గారెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్‌లో చేరబోతున్నారా? అని కూడా నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది.

Also Read: జగన్ , కేసీఆర్ లకు గొప్ప ఇబ్బందే వచ్చిందే?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper