Homeజాతీయ వార్తలుకీలక ప్రకటన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

కీలక ప్రకటన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల


తెలంగాణలో వైరస్ బారిన పడిన వారికి ఇకపై ఇళ్లలోనే చికిత్స చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లాక్డౌన్ సడలించడం వల్లనే కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రజలు జీవనోపాధి కొల్పోవద్దనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో లాక్డౌన్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని.. వైరస్ బారిన పడొద్దని సూచించారు. ప్రతీఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి తగుచర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొందరిలో వైరస్ లక్షణాలు కన్పించడం లేదని తెలిపారు. పదేళ్లలోపు చిన్నారులు, వయస్సు పైబడిన వారు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. రోడ్లపైకి వచ్చేటప్పుడు ప్రతీఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని వైద్యాశాఖ అధికారులకు సూచించారు. హోమ్ క్వారంటైన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. రోగ లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ ఉన్నవారికి మూడురోజులపాటు ఇళ్లలోనే చికిత్స అందించనున్నట్లు తెలిపారు. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఈటల తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో ఇళ్ల పక్కనే ఉండే కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు సహకరించాలని కోరారు. కరోనా జబ్బు బారిన పడిన వారిని బహిష్కరించే వంటి చర్యలకు పాల్పడొద్దంటూ సూచించారు. ప్రజలు అనవసర భయాందోళనలకు లోను కావద్దని మంత్రి సూచించారు.

పాజిటివ్ కేసుల్లో జ్వరం వచ్చిన వారికి మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స చేస్తామని తెలిపారు. మిగతా వారికి ఇళ్లల్లోనే చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కరోనా గాలి ద్వారా సోకదని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో గాంధీ ఆస్పత్రి నిండుకోవడం, కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వైద్యులపై పనిభారం పడుతుందన్నారు. వైద్యులపై ఒత్తిడి తగ్గించేందుకే హోం క్వారంటైన్ చేయనున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపులు ప్రజల జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకే చేశారన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి అనవసరంగా రోడ్లపైకి వచ్చి వైరస్ బారిన పడొద్దని సూచించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version