Homeజాతీయ వార్తలుఢిల్లీకి చేరిన దీదీ పంచాయితీ..

ఢిల్లీకి చేరిన దీదీ పంచాయితీ..

Mamata
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ.. అధికార పార్టీ హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రత్యర్థిగా మారిన తరువాత రూట్ మార్చుకున్న మమతా బెనర్జీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. బెంగాల్ అడబిడ్డగా చెప్పకునే మమతా బెనర్జీ బీజేపీని ఎదుర్కొనేందుకు సింపతీ పాలిటిక్స్ పై ఫోకస్ చేశారు. ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని బదిలీ చేసింది. తరువాత మమతపై జరగడంతో డీజీపీని మార్చడం వల్లే ఈ ఘటన జరిగినట్లు టీఎంసీ ప్రజల్లో ప్రచారం చేస్తోంది.

Also Read: నాగపూర్ లాక్ డౌన్.. పొంచి ఉన్న ముప్పు

తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో ఆమె ప్రత్యర్థిగా మారిన సువేందు అధికారికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి మమతా బెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దాడికి ముందు మేనిఫెస్టోను గురువారం విడుదల చేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. కానీ దీదీకి అయిన గాయం కారణంగా ఎన్నికల మేనిఫెస్టో వాయిదా పడినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీకి చికిత్స చేస్తున్న వైద్యులు ఆమె ఎడమ చీలమండకు తీవ్రగాయమైందని, చాతినొప్పితో బాధపడుతున్నారని తెలిపారు. ఆమె కుడి బుజం, కుడి ముంజేయి, మెడకు గాయమైందని తెలిపారు.

దీంతో పశ్చిమ బెంగాల్ పాలక టీఎంసీ గురువారం తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసుకుంది. మేనిఫెస్టోను విడుదల చేస్తే.. మమతా మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఆమెపై దాడి జరగడం కారణంగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆమె కోలుకునే వరకు మేనిఫెస్టోలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పశ్చిమ బెంగాల్ లో తన అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది.

Also Read: ప్రపంచం చూపు.. క్వాడ్ వైపు

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీదీ సోషల్ మీడియా వేదికగా.. తన సందేశాన్ని పంపుతున్నారు. బలమైన గాయాలు అయినా.. రెండు మూడు రోజుల్లో కోలుకుని.. ప్రచారంలో పాల్గొంటానని చెబుతున్నారు. ఇక దీదీపై దాడి ఘటనపై సీరియస్ గా ఉన్న టీఎంసీ నేతలు నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లజెండాలతో మౌనదీక్షకు పూనుకున్నారు. ఢిల్లీకి వెళ్లిన టీఎంసీ బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మమతాపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేయనున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Oktelugu Epaper
Exit mobile version