పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వైషమ్యాలు చెలరేగుతున్నాయి. పరస్పరం పగల సాధించుకోవడానికి బీజేపీ, టీఎంసీ పావులు కదుపుతున్నాయి. తమ పార్టీపై కుట్రలు చేశారని వారిని తక్షణమే కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పగతో రగిలిపోతున్నాయి. మానసిక క్షోభకు గురిచేసిన ఎదుటి పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
బెంగాల్ లో బీజేపీని నిర్వీర్యం చేసే పనిలో మమతాబెనర్జీ ఉన్నారు. ఎన్నికలకు ముందు అనేక మంది టీఎంసీ నేతలను బీజేపీలో చేర్చుకుంది. సువేందు అధికారి వంటి నమ్మకస్తుడైన నేతను కూడా బీజేపీ తన్నుకుపోయింది. అందు కోసమే బెంగాల్ లో బీజేపీ పని పట్టాలని నిర్ణయించుకున్నారు. తనను మానసిక క్షోభకు గురిచేసిన బీజేపీపై రివెంజ్ తీర్చుకోవడానికి మమత సిద్ధమయ్యారు.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలు తిరిగి టీఎంసీ వైపు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరందరికి మమత బెనర్జీ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. తిరిగి పార్టీలో వారిని చేర్చుకోవడం ద్వారా తాను తప్ప మరో దిక్కు లేదని పార్టీ నేతలకు మమత బలమైన సంకేతాలు పంపనున్నారు. బీజేపీని బలహీనం చేసే పనిలో మమత నిమగ్నమయ్యారు. త్వరలోనే బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు టీఎంసీలోకి వెళతారని తెలుస్తోంది.
ఎన్నికల్లో తనను ఓడించిన సువేందు అధికారిపై పగ తీర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై కేసు నమోదు అయింది. ప్రభుత్వ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి లక్షల విలువైన సామగ్రి దోచుకెళ్లారని ఆయనపై కేసు నమోదు కావడం విశేషం. మమత రివెంజ్ పాలిటిక్స్ కు తెరతీశారని తెలుస్తోంది. వరుసపెట్టి ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టిన వారిపై కక్ష సాధింపు చర్యలు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు వస్తున్నాయి.