TMC leaders controversy: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీని బీజేపీ చిత్తుగా ఓడించింది. అయినా తాము ఓడిపోలేదని, బిజెపి ఓట్ చోరీకి పాల్పడిందని రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రకటించారు. కానీ గవర్నర్ మమత ప్రభుత్వాన్ని రద్దు చేశారు. మమత వెనజి తరహాలోనే ఆ పార్టీ కార్యకర్తలు కూడా వ్యవహరిస్తున్నారు. అధికారం కోల్పోయిన అహంకారం తగ్గడం లేదు. గతంలో చేసినట్లుగానే బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. తాజాగా మే 5న బిజెపి కార్యకర్త మధు మండల్ ను టీఎంసీ మండల అధ్యక్షుడు కమల్ మండల్ తన అనుచరులతో కలిసి దాడి చేసి చంపేశాడు. ఇది టీఎంసీ పతనాన్ని, రాష్ట్ర రాజకీయాల్లో హింసా సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.
ఎన్నికల నేపథ్యం
ఏప్రిల్ 23, 29న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 206 సీట్లతో భారీ విజయం సాధించి, టీఎంసీ 15 సంవత్సరాల పాలనను అంతం చేసింది. టిఎంసీ 81 సీట్లకు పరిమితమైంది. అయితే బీజేపీ పోల్ మానిప్యులేషన్ చేసిందని టీఎంసీ ఆరోపణలు చేసింది.
మధు మండల్ హత్య..
రాజర్హట్-న్యూ టౌన్లో బీజేపీ అభ్యర్థి పియూష్ కనోడియా 309 మార్జిన్తో గెలిచిన విక్టరీ ర్యాలీలో మధు మండల్పై టీఎంసీ మండల నేత కమల్ మండల్, అతని అనుచరులు దాడి చేసి చంపారు. శవం మట్టిలో కనుగొన్నారు. కుటుంబ సభ్యులు నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. మే 6న పోలీసులు కుల్పబుల్ హోమైసైడ్ కేసులో కమల్ తోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.
భారీగా హింస..
ఈ దాడి నేపథ్యంలో
మొత్తం నలుగురు మరణించారు. డజన్ల మంది గాయపడ్డారు. టీఎంసీ కార్యాలయాలు అసన్సోల్, కూచ్బెహార్, కోల్కతాలో వాండలైజ్. బీజేపీ కార్యకర్తలపై మండల-జిల్లా టీ ఎంసీ నేతల దాడులు. రెండు పక్షాలు పరస్పర ఆరోపణలు చేస్తున్నాయి.
టీఎంసీ పతనం రాజకీయ హింసా సంస్కృతికి ముగింపు పెట్టాలి. 15 సంవత్సరాల పాలనలో బీజేపీపై దాడులు సాధారణం. ఇప్పుడు ఓటమి కోపంతో దాడులు కొనసాగుతున్నాయి. ఇది డెమాక్రసీకి ముప్పు, రాష్ట్రంలో భయాంధరణకు దారి తీస్తుంది. బీజేపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, న్యాయం అందించాలి. లేకపోతే, బెంగాల్ రాజకీయాలు హింసా చక్రంలో చిక్కుకుపోతాయి.