విజయవాడ అగ్ని ప్రమాదంలో చనిపోయింది ఆ మూడు జిల్లాల వారే…

ఈరోజు తెల్లవారుజామున ఎవరికీ అర్థం కాని రీతిలో బెజవాడ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తో ఒక్కసారిగా ఏపీ ప్రజలు కంగారుపడ్డారు. కోవిడ్ సెంటర్ గా మారిన స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో మంటలు వ్యాపించడంతో అంతా దట్టమైన పొగ పాకిపోవడంతో ఎవ్వరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్న వారు జరిగింది అర్థం చేసుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించే లోపలే మృత్యువు […]

Written By: Navya, Updated On : August 9, 2020 7:17 pm
Follow us on

ఈరోజు తెల్లవారుజామున ఎవరికీ అర్థం కాని రీతిలో బెజవాడ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం తో ఒక్కసారిగా ఏపీ ప్రజలు కంగారుపడ్డారు. కోవిడ్ సెంటర్ గా మారిన స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో క్షణాల్లో మంటలు వ్యాపించడంతో అంతా దట్టమైన పొగ పాకిపోవడంతో ఎవ్వరికీ ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్న వారు జరిగింది అర్థం చేసుకుని ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించే లోపలే మృత్యువు వారిని కాటేసింది.

 

ఇక అగ్నిమాపక సిబ్బంది కూడా ఎన్నో విఫలయత్నాలు చేసి కొంత మందిని కాపాడగలిగింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ భవనంలో ఉన్న 50 మందిలో పది మంది మరణించారు. మిగిలిన బాధితులను దగ్గరలోని కోవిడ్ సెంటర్లకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మరణించిన వారంతా మూడు జిల్లాలకు చెందిన వారే కావడం ఇక్కడ గమనార్హం. మరణించిన పదిమందిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన వారు కాగా…. అత్యధికులు కృష్ణా జిల్లాకు చెందిన వారు. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన వారు కూడా ఒకరు ఉన్నారు.

మరణించిన వారి పేర్లు, వివరాలను ఆరాతీయగా వారిలో ముగ్గురు తప్పించి మిగతా వాళ్ళందరూ బయటకి వచ్చారు. ఇక పదిమందికి పోస్టుమార్టం చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. అలాగే కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం పై, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే వారిలో 8 మంది కృష్ణా జిల్లాకు చెందిన వారు కాగా…. ముగ్గురు ప్రకాశం జిల్లాకు చెందిన వారు, ఒకరు మాత్రం గుంటూరు జిల్లా పొన్నూరు కు చెందిన వారు.

మరణించిన వారి వివరాలు

01. డోక్కు శివ బ్రహ్మయ్య (58) – మచిలీపట్నం
02. పూర్ణ చంద్ర రావు మొవ్వ
03. సుంకర బాబు రావు (రిటైర్డ్ ఎస్సై) – సింగ్ నగర్
04. మజ్జి గోపి (మచిలీపట్నం)
05. సువర్ణ లత పొన్నూరు – నిడుబ్రోలు
06. వెంకట లక్ష్మి సువర్చలా దేవి -(జయ లక్ష్మి) కందుకూరు
07. వెంకట లక్ష్మి సువర్చలా దేవీ (కందుకూరు)
08. ఎం. రమేష్ (విజయవాడ)
09. పవన్ కిషన్ (కందుకూరు)
10. చర్చి ఫాదర్ అబ్రహం(జగ్గయ్యపేట)