Homeజాతీయ వార్తలుAirfield In Kashmir: అత్యంత ఎత్తులో కాశ్మీర్ లో ఎయిర్ ఫీల్డ్.. ఇక చైనాకు దబిడ...

Airfield In Kashmir: అత్యంత ఎత్తులో కాశ్మీర్ లో ఎయిర్ ఫీల్డ్.. ఇక చైనాకు దబిడ దిబిడే..

Airfield In Kashmir: మనకు పక్కలె బల్లెంలా మారిన పాకిస్తాన్, చైనా తరచూ కవ్వింపు చర్యలతో భారత్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండగా, చైనా ఆక్రమణకు తెగబడుతోంది. తరచూ చైనా మ్యాప్‌ను మారుస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత్‌భూభాగాన్ని తన భూభాగంగా చూపుతోంది. ఇదే సమయంలో లద్దాఖ్, గాల్వన్‌ తదితర ప్రాంతాల్లో సైనిక శిబిరాలు ఏర్పాటు చేసి భారత్‌ను బెదిరిస్తోంది. ఈ తరుణంలో చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత సైన్యం కీలక నిర్మాణం చేపట్టింది. అక్టోబర్‌ నాటికి పూర్తయ్యే ఈ నిర్మాణంతో చైనాపై మన కంట్రోల్‌ ఉండే అవకాశం ఉంది.

Also Read: ‘హైదరాబాద్’ నుంచి ‘ఏపీ పాలన’!?

న్యూమా ఎయిర్‌ఫీల్డ్‌ నిర్మాణం..
లద్దాఖ్‌లోని న్యూమా వద్ద, చైనాతో సరిహద్దు రేఖ(ఎల్‌ఏసీ)కి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో, 13,470 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ముద్‌ ఎయిర్‌ఫీల్డ్‌ భారత రక్షణ వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. అక్టోబర్‌ 2025 నాటికి పూర్తయ్యే ఈ ఎయిర్‌ఫీల్డ్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌ (ఏఎల్‌జీ)గా గుర్తింపు పొందనుంది. 2.7 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో నిర్మితమవుతున్న ఈ ఎయిర్‌ఫీల్డ్, భారత ఫైటర్‌ జెట్లు, హెవీ–లిఫ్ట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలు, హెలికాప్టర్‌లను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ వ్యూహాత్మక స్థానం ఉన్నత సాంకేతికత భారత్‌ సరిహద్దు రక్షణను గణనీయంగా బలోపేతం చేస్తుంది.

వ్యూహాత్మక రక్షణ..
న్యూమా ఎయిర్‌ఫీల్డ్‌ లద్దాఖ్‌లోని డేమ్‌చోక్, డెప్సాంగ్, గాల్వ వంటి వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాలను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 2020లో గాల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణ తర్వాత, ఈ ప్రాంతంలో సైనిక సన్నద్ధతను పెంచేందుకు భారత్‌ వేగవంతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిని చేపట్టింది. డేమ్‌చోక్, డెప్సాంగ్‌ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఒప్పందాలు ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పునరుద్ధరించాయి. అయినప్పటికీ, న్యూమా ఎయిర్‌ఫీల్డ్‌ సామీప్యత ఈ ప్రాంతాల్లో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సైనిక స్పందనను సాధ్యం చేస్తుంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ ద్వారా సైనిక సామగ్రి, సిబ్బంది, లాజిస్టిక్‌ సపోర్ట్‌ను త్వరితగతిన సరఫరా చేయవచ్చు. ఇది చైనా దురాక్రమణలను అడ్డుకోవడంలో కీలకంగా మారుతుంది.

సరిహద్దు సన్నద్ధత
2020 గాల్వన్‌ ఘర్షణ తర్వాత, భారత్‌ లద్దాఖ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాలు, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. న్యూమా ఎయిర్‌ఫీల్డ్‌ ఈ వ్యూహాత్మక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగం. 2021లో రూ. 214 కోట్ల బడ్జెట్‌తో ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్, కఠినమైన వాతావరణ పరిస్థితులు, తక్కువ ఆక్సిజన్‌ స్థాయిలు, సవాళ్లతో కూడిన భూభాగంలో నిర్మితమవుతోంది. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో, కల్నల్‌ పొనుంగ్‌ డోమింగ్‌ నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్‌ 90–95% పూర్తయింది, ఇది భారత్‌ యొక్క సరిహద్దు రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ ఎయిర్‌ ఫీల్డ్‌ సైనిక అవసరాలతోపాటు పౌర వినియోగానికి కూడా ఉపయోగపడనుంది. లద్దాఖ్‌లోని రిమోట్‌ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం, స్థానిక సమాజాలకు అవసరమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఈ ఎయిర్‌ఫీల్డ్‌ అందిస్తుంది.

న్యూమా ఎయిర్‌ఫీల్డ్‌ భారత్‌ సరిహద్దు రక్షణ వ్యూహంలో ఒక ముఖ్యమైన అడుగు. చైనా గత కొన్ని సంవత్సరాలుగా ఎల్‌ఏసీ వెంట తన వైమానిక స్థావరాలను ఆధునీకరిస్తూ, జే–20 స్టెల్త్‌ ఫైటర్లు, డ్రోన్‌లు, ఇతర అధునాతన విమానాలను మోహరిస్తోంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, న్యూమా ఎయిర్‌ఫీల్డ్‌ భారత్‌కు వేగవంతమైన సైనిక స్పందన సామర్థ్యాన్ని అందిస్తుంది. అదే సమయంలో, ఈ ఎయిర్‌ఫీల్డ్‌ లద్దాఖ్‌లోని రిమోట్‌ ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ భారత్‌ యొక్క ‘వికసిత్‌ భారత్‌‘ లక్ష్యానికి అనుగుణంగా, రక్షణ, అభివృద్ధి రెండింటినీ సమతుల్యం చేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular