Omicron Death: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. మొదలైన థర్డ్ వేవ్ భయాలు?

Omicron Death:ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘ఒమిక్రాన్’ భారత్ లోనూ చాపకింద నీరులా పాకుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రత పెరగడంతో ఆంక్షలు మొదలయ్యాయి. మిగతా రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో థర్డ్ వేవ్ దిశగా పరిస్థితులు మారుతున్నాయి. దేశంలో తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా కేసుల సంఖ్య 5వేలకు చేరువైంది. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ కు చెందిన 73 ఏళ్ల […]

Written By: NARESH, Updated On : January 5, 2022 4:08 pm
Follow us on

Omicron Death:ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘ఒమిక్రాన్’ భారత్ లోనూ చాపకింద నీరులా పాకుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో తీవ్రత పెరగడంతో ఆంక్షలు మొదలయ్యాయి. మిగతా రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో థర్డ్ వేవ్ దిశగా పరిస్థితులు మారుతున్నాయి.

omicron

దేశంలో తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడా కేసుల సంఖ్య 5వేలకు చేరువైంది.

తాజాగా దేశంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం సంభవించింది. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్ తో కన్నుమూయడం విషాదం నింపింది.

డిసెంబర్ 15న కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతడి నుంచి సేకరించిన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది.

అయితే కోవిడ్ తీవ్రత తగ్గినా అనంతరం ఆ వృద్ధుడికి మధుమేహం, రక్తపోటు, హైపోథాయిడిజం వంటి సమస్యలు తీవ్రం కావడంతో మరణించాడు. రాజస్థాన్ లో ఇది తొలి ఒమిక్రాన్ మరణం కాగా.. దేశంలో ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఓ ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించాడు.

తీవ్రత చూస్తుంటే దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.