ఆంధ్రప్రదేశ్‌అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ

అది చంద్రబాబు కుట్రేనన్న బీజేపీ ఎంపీ

Chandrababu Naidu
ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం.. రోజుకొకటి చొప్పున ఈ వార్త వింటూనే ఉన్నాం. జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ దాడులు కామన్‌ అయిపోయాయి. అయితే..ఈ దాడులు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కుట్రేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. ఓ ఆంగ్ల వార్తా చాన‌ల్ చ‌ర్చా కార్యక్రమంలో స్వామి ఈ మేర‌కు ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావ‌డానికే తెలుగుదేశం ఈ దాడులు చేయిస్తోంద‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: అధికార పార్టీ టార్గెట్‌ బీజేపీ కాదంట.. ఆయనపైనే విమర్శలు

ఈ సంఘ‌ట‌న‌ల‌పై ఏపీ పోలీసులు త‌గిన చ‌ర్యలు తీసుకుంటున్నార‌ని కూడా స్వామి అన్నారు. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌లలో తెల్లవారుజామున రెండు గంట‌ల‌కు పూజ‌లు చేసి కూడా, వాటిని రాజ‌కీయ ప్రచారాల కోసం వాడుకోలేద‌ని స్వామి గుర్తు చేశారు. అలాగే టీటీడీ ఆదాయ‌వ్యయ వ్యవ‌హారాల‌ను కాగ్ ప‌రిధిలోకి తీసుకురావ‌డం కూడా జ‌గ‌న్ చేసిన మంచి ప‌ని స్వామి ప్రస్తావించారు. ఎన్నిక‌ల్లో సోనియాగాంధీతో క‌లిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త కుట్రల‌కు తెర‌తీశార‌నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తెలుగుదేశం హ‌యాంలోనే టీటీడీలో క్రిస్టియ‌న్ల నియామ‌కం జ‌రిగింద‌ని, వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం వ‌చ్చాకా టీటీడీలో హిందూయేత‌రుల‌ను నియ‌మించ‌కూడ‌ద‌ని నిర్ణయం తీసుకున్నార‌ని అది కూడా మంచి చ‌ర్య అని అభివర్ణించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియ‌న్ అని, ఆయ‌న భార్య మిష‌న‌రీ అని కూడా కొంత‌మంది ప్రచారం చేశార‌ని.. అయితే వారు న‌రేంద్రమోడీ క‌న్నా గొప్ప హిందువుల‌ని స్వామి అన్నారు.

Also Read: స్థానిక సంస్థల కోసం వైసీపీ భారీ స్కెచ్‌

అంతేకాదు.. ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వమే అన్ని ఆల‌యాల‌నూ స్వాధీనం చేసుకుని, ముఖ్యమంత్రే అన్ని ఆల‌యాల‌కూ చైర్మన్ అంటూ ప్రక‌టించుకుంద‌ని, ఈ విష‌యంపై త‌ను కోర్టుకు ఎక్కిన‌ట్టుగా స్వామి తెలిపారు. ఆ కేసు విచార‌ణ‌లో ఆల‌యాల‌పై అధికారం ప్రభుత్వానికి ఉండ‌ద‌నే అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింద‌ని, పూర్తి విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంద‌ని తెలిపారు. ఆల‌యాల‌పై ప్రభుత్వ పెత్తనాన్ని తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వాల మీద ఇది వ‌ర‌కూ కూడా ఆయన ధ్వజ‌మెత్తారు. ఏదిఏమైనా బీజేపీ ఎంపీ జగన్‌పై ఇలా సానుభూతి ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version