పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. గిన్నెదరిలో 9.5 డిగ్రీలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి భయానకంగా ఉంది. ఈశాన్య గాలులు చాలా తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా, ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ ఆదివారం తెల్లవారుజామున కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప […]

Written By: NARESH, Updated On : November 9, 2020 9:51 am
Follow us on

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పరిస్థితి భయానకంగా ఉంది. ఈశాన్య గాలులు చాలా తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా, ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఆదివారం తెల్లవారుజామున కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పది నుంచి పదిలోపు ఉష్ణోగ్రతులు రికార్డవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 5 డిగ్రీల వరకు తగ్గింది.

Also Read: కాంగ్రెస్.. బీజేపీలపై ఫైరవుతున్న కేటీఆర్.. ఎందుకు?

ఆదిలాబాద్‌ దక్కన్‌ పీఠభూమి ప్రాంతంలో ఉండడంతో అక్కడ చలి తీవ్రత ముందుగానే ప్రారంభమవుతుంది. గిన్నెధరిలో శనివారం పగలు గరిష్ఠ ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుండగా.. రాత్రికల్లా 23 డిగ్రీలు తగ్గి 9.5కి పడిపోయింది. 12 గంటల వ్యవధిలో 23 డిగ్రీలు తగ్గిపోవడం అరుదు. పదేళ్ల నవంబర్‌‌ నెల అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 2017 నవంబరు 27, 28 తేదీల్లో నమోదైంది. ఈ నెలాఖరుకల్లా ఈ రికార్డు చెరిగిపోతుందని అంచనా. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: వైరల్: వైసీపీ ఎమ్మెల్యే ఆడియో టేప్ లీక్ కలకలం

ఆదిలాబాద్‌తోపాటే హైదరాబాద్‌, హన్మకొండ, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్‌లో సైతం జనసమ్మర్థ ప్రాంతాలను బట్టి ఉష్ణోగ్రతల్లో తేడాలుంటున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నగర శివారులోని రాజేంద్రనగర్‌లో 15.5 డిగ్రీలుంది. శనివారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో 21.5 డిగ్రీలుండగా అదేరోజు రాత్రి 15.5కి పడిపోయింది. పగలు రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసమే కనిపిస్తోంది. నవంబర్‌‌ నెలలోనే చలి ఇలా ఉంటే.. మున్ముందు డిసెంబర్‌‌, జనవరి నెలల్లో ఎలా ఉండాలని ప్రజలు వణికిపోతున్నారు.