spot_img
Homeజాతీయ వార్తలురేవంత్ ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు?

రేవంత్ ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు?

Revanth Reddy

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్న‌డూ లేని ప‌రిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ లో ఇక‌పై చూడ‌బోతున్నాం. పీసీసీ అధ్య‌క్షుడు అంటే.. కాంగ్రెస్ త‌ర‌పున‌ కాబోయే ముఖ్య‌మంత్రి అని న‌మ్ముతారు. పార్టీ ప‌రంగా చూసుకున్న‌ప్పుడు సీఎం హోదాగా భావిస్తారు. అందుకే.. ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు చాలా మంది నేత‌లు. కోరిక అందరికీ ఉండొచ్చు. కానీ.. కావాల్సింది స‌మ‌ర్థ‌త. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ కు ఇది అనివార్య‌త కూడా. అందుకే.. సీనియారిటి, విధేయ‌త వంటి అంశాల‌ను ప‌క్క‌న పెట్టి, స‌మ‌ర్థ‌తనే అంద‌లం ఎక్కించింది అధిష్టానం. మ‌రి, రాబోయే రోజులు ఎలా ఉంటాయ‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.

త‌మ‌ను కాద‌ని రేవంత్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌డాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ల‌లో దాదాపుగా ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నార‌నేది వాస్త‌వం. దీన్ని అడ్డుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌గ‌ల‌రో.. అన్నీ చేశారు. ద‌శాబ్దాలుగా పార్టీని ప‌ట్టుకు వేళాడుతున్న త‌మ‌ను కాద‌ని, వేరే పార్టీలో నుంచి వ‌చ్చిన రేవంత్ కు ఎలా ఇస్తార‌ని ర‌గిలిపోయారు. సీనియ‌ర్ల‌లోనే ఒక‌రికి ఇవ్వాలి త‌ప్ప‌, రేవంత్ కు ఇస్తే అంగీక‌రించేది లేనే లేద‌ని చెప్పివ‌చ్చారు.

అయితే.. సీనియారిటీ పాచిక పార‌ట్లేద‌ని భావించి.. విధేయ‌త‌ను ముందుకు తెచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు విధేయులుగా ఉన్న‌వారికే పీఠం ఇవ్వాల‌నే డిమాండ్ ముందుకు తెచ్చారు. ఈ మేర‌కు భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య లెటర్ హెడ్ మీద లేఖ కూడా రాశార‌ట‌. ఇందులో త‌మ ఆక్రోశం అంతా వెల్లగ‌క్కారు. ఈ విధంగా అవ‌కాశం ఉన్న అస్త్రాల‌న్నీ వాడేశారు.

కానీ.. పార్టీ ప‌రిస్థితి వేరుగా ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు సార్లు అధికారానికి దూర‌మైంది. ఈ గ్యాప్ లో అవ‌కాశం ఉన్న నేత‌లంతా ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయిపోయారు. మ‌రోసారి కూడా అధికారం చేజారిపోతే.. పార్టీ పుట్టి మునిగిన‌ట్టేన‌నే భ‌యం అటు అధిష్టానంతోపాటు కేడ‌ర్ లో కూడా ఉంది. అందుకే.. కేసీఆర్ ను ఢీకొట్టే స‌త్తా ఉన్న నేత‌గా రేవంతే స‌రైన‌వాడు అని భావించి.. బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అయితే.. రేవంత్ కు పీసీసీ ఇస్తే.. తాము స‌హ‌క‌రించేది లేద‌ని ప‌లువురు సీనియ‌ర్లు ఇండైరెక్టుగా చెప్ప‌నే చెప్పారు. మ‌రికొంద‌రైతే పార్టీ నుంచి వెళ్లిపోతామ‌ని కూడా లీకులు ఇచ్చారు. అధిష్టానం మాత్రం మీరేమైనా చేసుకోండి.. పార్టీని బ‌తికించుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని తేల్చి చెప్పింది. మ‌రి, భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోంది అన్న‌ది అస‌లు పాయింటు. రేవంత్ ప‌గ్గాలనైతే సాధించాడు. మ‌రి, ర‌థాన్ని ఎలా ముందుకు న‌డిపిస్తాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. అధిష్టానం ఆశించిన‌ట్టు ముందుకు సాగితే మాత్రం.. పార్టీ బాగుప‌డ‌డంతో, ఆయ‌న భ‌విష్య‌త్ సైతం బ్ర‌హ్మాండంగా ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌రి, ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? అన్న‌దే చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper
Exit mobile version