కంట్రోల్‌ తప్పుతున్న ఎమ్మెల్యేలు..: కట్టడి చేసేది ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం నడుస్తోంది. దీంతో రోజురోజుకూ కేసీఆర్‌‌ పరిస్థితి దయనీయంగా తయారవుతోందట. పార్టీ నేతలపై పట్టుకోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కుమారుడికి పట్టం కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత పార్టీ నేతలు కేటీఆర్‌కు మద్దతుగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. తమదైన రాజకీయం చేసే నేతలు కూడా ఎక్కువైపోయారు. Also Read: కేటీఆర్‌‌ ఎట్టి పరిస్థితిలో సీఎం కాడంట..: రేవంత్‌ వ్యాఖ్యలు ఇంకొందరు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ పార్టీకి కొత్త […]

Written By: Srinivas, Updated On : January 26, 2021 1:43 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం నడుస్తోంది. దీంతో రోజురోజుకూ కేసీఆర్‌‌ పరిస్థితి దయనీయంగా తయారవుతోందట. పార్టీ నేతలపై పట్టుకోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన కుమారుడికి పట్టం కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న సమాచారం బయటకు వచ్చిన తర్వాత పార్టీ నేతలు కేటీఆర్‌కు మద్దతుగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. తమదైన రాజకీయం చేసే నేతలు కూడా ఎక్కువైపోయారు.

Also Read: కేటీఆర్‌‌ ఎట్టి పరిస్థితిలో సీఎం కాడంట..: రేవంత్‌ వ్యాఖ్యలు

ఇంకొందరు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నారు. నిన్నామొన్నటి వరకూ మీడియా ముందు ఏం మాట్లాడాలన్నా ప్రగతి భవన్ నుంచి ఏ టాపిక్‌ మీద మాట్లాడాలో పాయింట్లు అందేవి. వాటికి మించి ఒక్కటి కూడా ఎక్కువ మాట్లాడటానికి లేదు. కానీ ఇప్పుడు.. ఎలాంటి పాయింట్లు అందకపోయినా నేతలు మాట్లాడేస్తున్నారు. గతంలో ఉన్నంత భయం ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో ఏం మాట్లాడితే ఏం అవుతుందో అన్న ఉద్దేశంతో చాలా మంది నేతలను టీవీ చర్చలకు వెళ్లకుండా టీఆర్ఎస్ కట్టడి చేసింది. కేటీఆర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేయడానికి మాత్రం ప్రస్తుతానికి టీఆర్ఎస్ హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.

దీన్ని ఆ పార్టీ నేతలు మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. విపక్ష నేతల్ని విమర్శిస్తున్నామని అనుకుంటున్నారో.. సొంత పార్టీ నేతల్ని బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటున్నారో కానీ ప్రకటనలు మాత్రం ప్రారంభించారు. అయోధ్య రాముడి గుడి విరాళాలపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన ప్రకటన అలజడికి కారణం అయింది. వెంటనే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి.. విరాళం ఇప్పించి మరీ వివాదాస్పదం కాకుండా చేయగలిగారు.

Also Read: కేటీఆర్ కేబినెట్ లో అంతా యువ బ్యాచ్? వీరికే చాన్స్?

రామ మందిర్ విరాళాల విషయంలో చెలరేగిన వివాదం పూర్తిగా తగ్గక ముందే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరో బాంబు పేల్చారు. ఆయన నేరుగా పార్టీ తీరు పైన సెటైర్లు వేశారు. తానొక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. స్వేచ్ఛగా పాడలేకపోతున్నానని, మాట్లాడలేకపోతున్నానని, స్వేచ్ఛ లేకుండా పోయిందని, తాను ఇలాంటి జీవితాన్ని కోరుకోలేదని నిర్వేదంతో మాట్లాడారు. కవులు, కళాకారుల మౌనం కేన్సర్ కంటే ప్రమాదకరమన్నారు.

అయితే.. రసమయి అలా మాట్లాడడం వెనుక ఏదో దాగి ఉన్నట్లుగా అర్థం చేసుకోక తప్పదు. రసమయిని కేబినెట్‌లోకి తీసుకుంటామని స్వయంగా కేసీఆరే ఓ బహిరంగంగా ప్రకటించారు. కానీ.. అది ఇప్పటివరకు జరగలేదు. అందుకే తనను గుర్తించాలని.. కేటీఆర్ మంత్రివర్గంలో చోటు కోసం ఇలాంటి రాజకీయం ప్రారంభించారని టీఆర్ఎస్ వర్గాలు గొణుక్కుంటున్నాయి. టీఆర్ఎస్‌లో ముందు ముందు ఇలాంటి రాజకీయం మరింత జోరందుకుంటుందని ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆరే తెచ్చారని ఎలా కంట్రోల్ చేయాలో ఆయనకు తెలుసన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ అసంతృప్తులందరినీ కేసీఆర్‌‌ ఎలా బుజ్జగిస్తారా అనేది కూడా ఇప్పుడు పెద్ద టాస్క్‌ అయింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్