spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vizag Steel Plant Bidding: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనని తెలంగాణ సర్కార్.....

Vizag Steel Plant Bidding: వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్ లో పాల్గొనని తెలంగాణ సర్కార్.. ఏపీలో ఎంట్రీకి దక్కని అవకాశం..!

Vizag Steel Plant Bidding
Vizag Steel Plant Bidding

Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టాలని భావించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి ఆ అవకాశం దక్కకుండా పోయింది. స్టీల్ ప్లాంట్ విక్రయానికి సంబంధించి నిర్వహించే బిడ్ లో పాల్గొంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెప్పింది. అందుకు అనుగుణంగానే అధికారులతో కూడిన బృందాన్ని స్టీల్ ప్లాంట్ కు పంపించింది. దీంతో తెలంగాణ సర్కార్ ఈ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేస్తుందని ఇక్కడ కార్మిక వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తయారయింది తెలంగాణ రాష్ట్ర సర్కార్ పరిస్థితి.

ప్రైవేటీకరణ ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్లడం లేదంటూ ఓ కేంద్రమంత్రి చేసిన ప్రకటనపై స్పందించిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.. కెసిఆర్ దెబ్బకు కేంద్రం అబ్బా అన్నదని గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కనీసం బిడ్ లో కూడా పాల్గొనలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం పేరుతో ఏపీలో అడుగు పెట్టాలనుకున్న బిఆర్ఎస్ కు ఇక్కడ పరిస్థితులు పెద్దగా అనుకూలించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకి బిడ్ ఎందుకు వేయలేదని తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రశ్నిస్తున్నారు. ముందు గొప్పలు చెప్పి.. సమయం దాటిపోతున్న బిడ్ వేయకుండా ఎందుకు మోసం చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీలో బహిరంగ సభ పెట్టాలనుకున్న బిఆర్ఎస్ పార్టీకి ఆదిలోనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనట్లు చెబుతున్నారు.

మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పునరాలోచించాల్సిన పరిస్థితి..

స్టీల్ ప్లాంట్ విషయంలో ముందు నుంచి అంకితభావంతో పోరాటం చేస్తున్నారు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు ఆయన. కెసిఆర్ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని ప్రకటించినప్పుడు బలంగా ఆయనను సమర్థించారు మాజీ జెడి లక్ష్మీనారాయణ. ఇదే సమయంలో లక్ష్మీనారాయణ ను పార్టీలోకి తీసుకురావాలని భావించారు కేసీఆర్. ఆయనతో చర్చలు కూడా జరిపారు. అయితే, బిఆర్ఎస్ కు ఏపీలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా లక్ష్మీనారాయణ పునరాలోచన చేసినట్టు చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉపయోగపడుతుందనెలా పరిస్థితులు ఏర్పడ్డాయి. బిడ్ వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు మొదట లక్ష్మీనారాయణ కేసీఆర్ ను పొగిడారు. కానీ ఇప్పుడు బిడ్ వేయకపోవడంతో ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరికపై ఆలోచించాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి.

Vizag Steel Plant Bidding
Vizag Steel Plant Bidding

విస్తరణపై దృష్టి సారించని బిఆర్ఎస్..

దేశ వ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్ర సమితిని బిఆర్ఎస్ గా మార్పు చేసిన సమయంలో కేసీఆర్ గొప్పగా చెప్పారు. అయితే ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడంపై ఆ పార్టీ అగ్ర నాయకులు దృష్టి సారించలేదు. మహారాష్ట్రలో మాత్రం వరుసగా మూడు సభలు పెడుతున్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలను మాత్రం బిఆర్ఎస్ నేతలు పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఉన్న కర్ణాటక పై అసలు దృష్టి పెట్టలేదు ఆ పార్టీ నాయకులు. ఏపీ, ఒడిశాలకు ఇన్చార్జిలను నియమించినప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేవు. ఏపీలో అడుగుపెట్టడానికి ఉన్న ఒక్కగానొక్క అవకాశాన్ని టిఆర్ఎస్ నాయకులు వదులుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఏపీలో అడుగు పెట్టేందుకు ఉన్న అవకాశాలు ఏమీ కనిపించడం లేదని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యను ఉపయోగించుకుంటే ఎక్కువ మంది పార్టీలో చేరే అవకాశం ఉండేదని, ఇప్పుడు బిడ్ లో పాల్గొనకపోవడం వలన ఆసక్తి ఉన్నవారు కూడా ముందుకు రాకపోయే పరిస్థితి ఏర్పడిందని పలువురు పేర్కొంటున్నారు.

Related News

Most Popular

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
Oktelugu Epaper
Exit mobile version