Assembly Election : తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమరానికి సై అంటున్నాయి. మూడోసారి విజయం సాధించాలని బీఆర్ఎస్, అధికార బీఆర్ఎస్ను గద్దించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఫోకస్ చేసింది. ఈమేరకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. డిప్యూటీ కమిషనర్ నితీశ్వ్యాస్ నేతృత్వంలోని ఈసీ బృందం హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్, ఇతర అధికారులతో శనివారం సమావేశం అయ్యారు.
ఓటర్ల జాబితా, ఈవీఎంలపై చర్చ..
ఈవీఎంల సన్నద్ధత, ఓటర్ల జాబితాలో చేర్పులు, ఈవీఎంల తనిఖీ, అధికారులకు శిక్షణ తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులతో చర్చించారు. ఓటర్ల జాబితా మార్పులు చేర్పులపై సమీక్షించిన ఈసీ బృందం, ఎటువంటి లోపాలు లేకుండా ఓటర్ల జాబితా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు రిటర్నింగ్ అధికారుల సమగ్ర జాబితాని కూడా సిద్ధం చేయాలని సీఈవోను ఆదేశించారు.
మే 1 నుంచి తనిఖీలు..
ఆర్వోలు మే ఒకటి నుంచి ఈవీఎంలను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో జిల్లాస్థాయి ఎన్నికల అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పటినుంచే ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ఈవీఎంల మొదటి దశ చెకింగ్ చేపట్టాలని, ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేశారు. అధికారుల శిక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని హైదరాబాదఃకు వచ్చిన ఈసీ బృందం సూచించింది.
మొత్తంగా రాజకీయా పార్టీలు ఎని్నకల సమరానికి సమాయత్తం అవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ ఎని్నకల ప్రక్రియ ప్రారంభించడంతో పరిస్థితులన్నీ ఎన్నికల మూడ్లోకి వెళ్లనున్నాయి. రాజకీయ పార్టీలు కూడా దూకుడు పెంచే అవకాశం ఉంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More