TDP, YCP Targets On Kapu Vote Bank : ఏపీలో కాపు సామాజికవర్గం ఎటువైపు అన్నది ఆసక్తి రేపుతోంది. వివిధ పార్టీల్లో ఉన్న నేతలు ఎటు తిరుగుతారన్నది ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రిలో కాపు వైసీపీ మంత్రుల సమావేశం చర్చనీయాంశమైంది. కాపులను వైసీపీ నుంచి దూరం చేయవద్దని జగన్ ఈ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ రాకతో ఏపీలో కాపు సామాజికవర్గం ఒక్కటవుతున్నారన్న భయం ఇటు జగన్ లో.. అటు చంద్రబాబులో మొదలైంది. అప్పుడు ఎవరికి వారు కాపు నేతలను ముందుపెట్టి వారికి ప్రాధాన్యతనిస్తున్నట్టు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దీంతో అలెర్ట్ అయిన కాపు నేతలందరూ రాజకీయాలకు అతీతంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.
కాపు నాయకులు ప్రస్తుతం తమ ఉనికిని చూసి భయపడుతున్నారు.ఈ మార్పు ఎటువైపు దారితీస్తుంది. ఇందులో మన భవిష్యత్ ఏమిటీ? మనం చెప్పినట్టు మన సామాజికవర్గం వింటుందా? లేదా? అన్నది కాపు నేతల్లో మొదలైంది.
మరి కాపు సామాజికవర్గం ఎటువైపు ఉంది.? కాపు నేతలను వీళ్లు నమ్ముతున్నారా? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..