టీడీపీ విచిత్ర డిమాండ్!!

  ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. అయితే తాజాగా టీడీపీ నేతలు ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ సంక్షేమ పథకానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు పెట్టలంటూ ఇవాళ విపక్ష టీడీపీ ఓ విచిత్రమైన డిమాండ్ చేసింది. గతంలో టీడీపీ-కాంగ్రెస్ రహస్య మిత్రులంటూ వైసీపీ ఆరోపణలు చేసేది. ఆ ఆరోపణలు కాస్తా ఇప్పుడు నిజమయ్యాయా అనే వాదనకు బలం చేకూర్చేలా టీడీపీ డిమాండ్ ఉంది. […]

Written By: Neelambaram, Updated On : July 15, 2020 7:46 pm
Follow us on

 

ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. అయితే తాజాగా టీడీపీ నేతలు ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ సంక్షేమ పథకానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు పెట్టలంటూ ఇవాళ విపక్ష టీడీపీ ఓ విచిత్రమైన డిమాండ్ చేసింది. గతంలో టీడీపీ-కాంగ్రెస్ రహస్య మిత్రులంటూ వైసీపీ ఆరోపణలు చేసేది. ఆ ఆరోపణలు కాస్తా ఇప్పుడు నిజమయ్యాయా అనే వాదనకు బలం చేకూర్చేలా టీడీపీ డిమాండ్ ఉంది.

ఇంతకీ వైసీపీ అమలు చేస్తున్న ఆ పథకం పేరు వైఎస్సార్ సున్నావడ్డీ రుణ పథకం కాగా.. గతంలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి ఆయన పేరుతోనే అమలు చేయాలంటూ టీడీపీ నేత సోమిరెడ్డి కోరడం కలకలం రేపింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ ఆ తర్వాత ఆయన చెప్పుగుర్తుతో పెట్టిన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో రాజకీయాలకు కొంతకాలం దూరమయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన పేరు పెట్టాలంటూ టీడీపీ కోరడం వెనుక రాజకీయం ఏమై ఉంటుందా అని అంతా చర్చించుకుంటున్నారు.