spot_img
Homeక్రైమ్‌Illegal Affair : శాంతిభద్రతలు కాపాడాల్సిన ఎస్సై, కానిస్టేబుల్ దారి తప్పారు... ఒకే మహిళతో వివాహేతర...

Illegal Affair : శాంతిభద్రతలు కాపాడాల్సిన ఎస్సై, కానిస్టేబుల్ దారి తప్పారు… ఒకే మహిళతో వివాహేతర సంబంధం.. పోలీస్ శాఖ ఏం నిర్ణయం తీసుకుందంటే..

Illegal Affair :  తమిళనాడు రాష్ట్రంలో కళ్ళకురుచి జిల్లాలో ఊళుందుర్ పేట సమీపంలో పిల్లూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో రమణి, అశోక్ భార్యాభర్తలు. ఆగస్టు నెల 19న రమణిని ఆమె భర్త అశోక్ హత్య చేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తులో భాగంగా అశోక్ ను విచారించారు. ఈ సందర్భంగా అతడు సంచలన విషయాలు వెల్లడించాడు..” నా భార్య రమణికి వివాహేతర సంబంధం ఉంది. తిరునావలూర్ ఎస్ఐ నందగోపాల్ నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై నా భార్యను నిలదీశాను. దీంతో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్త పెద్దది కావడంతో ఆమెను హత్య చేశానని” అశోక్ వెల్లడించాడు. అశోక్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఎస్ఐ నందగోపాల్ పై శాఖా పరమైన విచారణ కొనసాగించారు. నందగోపాల్, రమణ కి మధ్య వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో నందగోపాల్ ను సస్పెండ్ చేస్తూ విళుపురం రేంజ్ డిఐజి దిశా మిట్టల్ నిర్ణయం తీసుకున్నారు.

కానిస్టేబుల్ కూడా..

నందగోపాల్ మాత్రమే కాదు విళుపురం జిల్లా మరక్కాణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కళ్లకురిచి ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు రమణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అశోక్ కు తెలియకుండా పలుమార్లు రమణి, ప్రభాకరన్ బయటికి వెళ్లేవారు. సమీపంలో ఉన్న లాడ్జిలలో గడిపి వచ్చేవారు. అయితే ఈ విషయం కూడా అశోక్ కు తెలిసింది. అప్పట్లో రమణిని మందలించాడు. ఆయనప్పటికీ ఆమె తన ప్రవర్తనను మార్చుకోలేదు. చివరికి ఎస్ఐ నందగోపాల్ రమణి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరు ఒకరోజు ఏకాంతంగా ఉండగా అశోక్ చూశాడు. ఆ విషయంపై రమణిని నిలదీశాడు. అయితే ఈ విషయంపై ఆమె దాటవేత ధోరణి ప్రదర్శించింది. ఫలితంగా అశోక్ లో కోపం పెరిగిపోయి రమణిని హత్య చేశాడు.

పోలీస్ శాఖలో సంచలనం

పోలీస్ శాఖలో ఒకే మహిళతో అటు ఎస్సై, ఇటు కానిస్టేబుల్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో సంచలనంగా మారింది. ఈ విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఎస్ఐ నందగోపాల్, కానిస్టేబుల్ ప్రభాకరన్ పై పోలీస్ అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం అశోక్ జైల్లో ఉన్నాడు. అయితే అశోక్ – రమణి దంపతులకు సంతానం ఉందా? లేదా? అనే విషయాలు తెలియ రాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper