Homeఆంధ్రప్రదేశ్‌TDP: కృష్ణా జిల్లాలో ఆ మూడు స్థానాలు టీడీపీకి హాట్ గురూ

TDP: కృష్ణా జిల్లాలో ఆ మూడు స్థానాలు టీడీపీకి హాట్ గురూ

TDP: తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాల్లో కృష్ణా ఒకటి. ఎన్టీఆర్ సొంత జిల్లాతో పాటు కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండే జిల్లా ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపి మంచి ఫలితాలు సాధిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో మాత్రం దెబ్బతింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవని విశ్లేషణలు ఉన్నాయి. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి వైసీపీ సర్కార్ మూడు రాజధానులను తెరపైకి తేవడంతో.. ఈ జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీంతో ఈ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలు కూడా అదే అంశాన్ని తేల్చి చెబుతున్నాయి. దీంతో టీడీపీ టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది.

ఈ జిల్లాలో గెలుపోటములను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ప్రతి సీటు గెలిచేందుకు టిడిపిలో స్థానిక నేతలతో పాటు ఎన్నారైలు సైతం పనిచేస్తుంటారు. అభ్యర్థులకు పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తుంటారు. దీంతో ఫలితం ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలకు విపరీతమైన పోటీ నెలకొంది. ఈ సీట్లలో టిడిపి గెలుపు పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో టిక్కెట్ల కోసం గట్టి పోటీ కనిపిస్తోంది. ఎవరికివారుగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వారికోసం పెద్ద తలకాయలే రంగంలోకి దిగాయి.

ప్రధానంగా పెనమలూరు, మైలవరం, తిరువూరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ మూడు నియోజకవర్గాల్లో వైసిపి సిట్టింగ్లే ఉన్నారు. ఇందులో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలో చేరనున్నారు.ఈ మూడు స్థానాల్లో వైసిపి గెలిచే ఛాన్స్ లేదని అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. దీంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో నుంచి ముగ్గురేసి అభ్యర్థులు టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ పెద్దలతో పెద్ద లాబీయింగ్ చేస్తున్నారు. పెనమలూరు కి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా, మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. అటు మైలవరం టికెట్ కోసం వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు దేవినేని ఉమా ప్రయత్నిస్తున్నారు. బొమ్మసాని సుబ్బారావు సైతం తన ప్రయత్నాల్లో ఉన్నారు. తిరువూరు సీటు కోసం ప్రస్తుతం ఇంచార్జ్ సేవల దేవదత్, అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు, తోకల జనార్ధన రావు, వైసీపీ నుంచి వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవెల్లి శ్రీదేవి, గతంలో పోటీచేసి ఓడిన జవహర్ పేర్లు వినిపిస్తున్నాయి. టిడిపి కచ్చితంగా గెలిచే స్థానాలు కావడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారిలో టిక్కెట్ దక్కించుకునేది ఎవరో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...
Oktelugu Epaper
Exit mobile version