https://oktelugu.com/

Saidabad victim: రూ.20 లక్షల ప్రభుత్వ సాయాన్ని తిరస్కరించిన హత్యాచార బాలిక కుటుంబం

Saidabad victim: ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. నమ్మకం సన్నగిల్లుతోంది. ఆపద కలిగినప్పుడు ఓదార్పు లేకున్నా సాయం చేస్తున్నామని చెప్పుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో ఆరేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటనలో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అంత దారుణం జరిగినా ప్రభుత్వం నుంచి ఓదార్పు అటుంచింతే నేతలెవరు కూడా స్పందించలేదు. పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో బాధిత కుటుంబంలో ఆగ్రహం పెరిగింది. దీంతో బాలిక కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ […]

Written By: , Updated On : September 16, 2021 / 02:34 PM IST
Follow us on

Saidabad victim familySaidabad victim: ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోతోంది. నమ్మకం సన్నగిల్లుతోంది. ఆపద కలిగినప్పుడు ఓదార్పు లేకున్నా సాయం చేస్తున్నామని చెప్పుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో ఆరేళ్ల బాలికపై హత్యాచారం చేసిన ఘటనలో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. అంత దారుణం జరిగినా ప్రభుత్వం నుంచి ఓదార్పు అటుంచింతే నేతలెవరు కూడా స్పందించలేదు. పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో బాధిత కుటుంబంలో ఆగ్రహం పెరిగింది. దీంతో బాలిక కుటుంబాన్ని మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ గురువారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మంత్రులు రూ.20 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందించేందుకు ముందుకు వచ్చినా బాలిక తండ్రి మాత్రం ససేమిరా అన్నారు. మాకు డబ్బులొద్దు న్యాయం కావాలని విలపించారు. కన్నబిడ్డను పోగొట్టుకున్న తమకు ఆర్థిక సాయం అక్కర్లేదని తిరస్కరించారు. మంత్రులు ఇచ్చిన చెక్కును తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. నేతలపై అసలు నమ్మకం లేకుండా పోతోందని వాపోయారు.

దీంతో మంత్రులు ఆ చెక్కును ఇంట్లో పెట్టి వెళ్లిపోయారు. రూ.20 లక్షల చెక్కు మాకు అక్కరలేదని అన్నారు. ప్రభుత్వం నిందితుడిని పట్టుకునేందుకు శ్రద్ధ చూపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో రూ.20 లక్షలు ఇచ్చినా అవసరం లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వ తీరుతో వారిలో అసహనం పెరిగిపోయింది. ప్రాణాలను పైసలతో కొంటారా అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై బహిరంగంగా విమర్శలు రావడంతో మంత్రులు ఏం మాట్టాడకుండా వెళ్లిపోయారు. ఆరేళ్ల చిన్నారిపై మానవ మృగం పైశాచిక దాడి చేయడంతో తీవ్రంగా నష్టపోయామని పేర్కొన్నారు. తమ ప్రాణంగా పెంచుకున్న చిన్నారిని కోల్పోయినందుకు బాధగా ఉందని అన్నారు. అయినా ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణమని అన్నారు.