Homeజాతీయ వార్తలుCommunist govt Sabarimala controversy: కమ్యూనిస్టుల పరిపాలనలో శబరిమల కంపు కంపు.. ఇదిగో హైకోర్టు బయటపెట్టిన...

Communist govt Sabarimala controversy: కమ్యూనిస్టుల పరిపాలనలో శబరిమల కంపు కంపు.. ఇదిగో హైకోర్టు బయటపెట్టిన అక్రమాల చిట్టా

Communist govt Sabarimala controversy: దేవుడిని కొంతమంది నమ్ముతారు. ఇంకొంతమంది నమ్మరు. అయినంత మాత్రాన నమ్మేవారు పిచ్చివాళ్లు కాదు. నమ్మని వాళ్లు గొప్ప వాళ్ళు కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ కమ్యూనిస్టులు ఇలా కాదు. ఊరంతా ఒకదారిలో వెళ్తుంటే.. వారు మరొక దారిలో వెళ్తుంటారు. పైగా తమ దారిలోని రావాలని ఉపన్యాసాలిస్తుంటారు. చివరికి తమ దారి గురించి గొప్పగా చెప్పి.. మిగతావారు వెళ్లే దారి గురించి అసత్య ప్రచారం చేస్తుంటారు. అందువల్లే కమ్యూనిస్టులు ఇప్పుడు మనదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు.

కమ్యూనిస్టులు నిన్నటిదాకా పరిపాలించిన కేరళ రాష్ట్రంలో జరిగిన దారుణాలు మామూలువి కావు. భూముల ఆక్రమణ నుంచి మొదలుపెడితే.. శబరిమల ఆలయంలో జరిగిన అక్రమాల వరకు.. ఎన్నో ఉదంతాలు కేరళ రాష్ట్రంలో చోటుచేసుకొన్నాయి. అప్పట్లో శబరిమల ఆలయంలో మహిళలకు ఎందుకు ప్రవేశం కల్పించారు అంటూ జరిగిన ఉద్యమానికి కేరళ ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందని ఇప్పటికి ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.. పైగా శబరిమల ఆలయానికి సంబంధించిన ప్రాశస్యాన్ని దెబ్బ తీశారని విమర్శలు ఉన్నాయి. పైగా ఆలయంలో బంగారు తాపడంలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని కేసులు నమోదయ్యాయి. తాజాగా శబరిమల ఆలయానికి సంబంధించిన ఒక అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.

శబరిమల ఆలయాన్ని హిందువులు ఎక్కువగా దర్శించుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సమయంలో అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటికీటలాడుతూ ఉంటుంది. సన్నిధానం అయ్యప్ప మాలధారుల సంద్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యప్పకు ప్రతిరోజు విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పూజలు సక్రమంగా జరిగితే బాగుండేది. గడచిన దశాబ్ద కాలంగా అయ్యప్ప స్వామికి జరిపే పూజలు విషయంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి.

ఇదే విషయాన్ని కేరళ హైకోర్టు ప్రస్తావించింది. అంతేకాదు పూజలపై ఆడిట్ నిర్వహించాలని సూచించింది. అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజా సామాగ్రి కొనుగోలు విషయంలో కూడా అవ్వక తవకలు జరిగినట్టు హైకోర్టు పేర్కొంది. శబరిమల స్పెషల్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అయ్యప్ప స్వామికి నిర్వహించే పూజలలో అక్రమాలు జరుగుతున్నట్టు ఇటీవల ఓ భక్తుడు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. అతడు చెప్పిన విషయాల మొత్తం నిజమని విజిలెన్స్ విభాగం అభిప్రాయపడింది. ముఖ్యంగా స్వామి వారికి సంబంధించిన అష్టాభిషేకం పూజ కోసం లేత కొబ్బరికాయల పాలవినియోగంలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు.. ఇంకా 8 వస్తువులకు 300 రూపాయల దాకా వసూలు చేసినట్టు విజిలెన్స్ విభాగం ఎంక్వయిరీలో తేలింది.

దశాబ్దకాలంగా ఎటువంటి బిల్లులు లేకుండానే వీటిని కొనుగోలు చేశారని హైకోర్టు అభిప్రాయపడింది. మాస పూజ, మకర విలక్కు పూజల్లో కూడా అక్రమాలు జరిగాయి. అయితే ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల పరిపాలన కాలంలో జరగడం ఇక్కడ విశేషం. ఇప్పటికే బంగారం తాపడంలో అక్రమాలు జరిగి.. కొంతమంది జైలు పాలు కూడా అయ్యారు. ఇప్పుడు హైకోర్టు స్వయంగా రంగంలోకి దిగడంతో ఎంతమంది జైలుకు వెళ్తారనే చర్చ కేరళ రాష్ట్రంలో సాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular