
ఇప్పుడు తాజాగా.. మల్కాజిగిరి నుంచి ఎంపీగా ప్రాతినథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు గ్రేటర్ బాధ్యతలు ఏమీ ఇవ్వకున్నా స్థానిక ఎంపీ కారణంగా దూకుడుగా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ప్రజల ఇబ్బందులను గుర్తుచేస్తూ కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. శివారు కాలనీలు పూర్తిగా నీట మునగడంతో రేవంత్ ఈ టాపిక్ను ఎంచుకున్నారు.
తన నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్లో ఆయన విస్తృతంగా పర్యటించడమే కాదు.. మంత్రి కేటీఆర్కు ప్రజల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నికల సన్నద్ధత కోసం కేటీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. రోజుకు ఒక్క సారైనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్ హైలెట్ చేస్తున్నారు. కేటీఆర్ ఎప్పుడూ వీడియో కాన్ఫరెన్స్ల్లో ఉంటున్నారని.. ప్రజలు నీళ్లలో మునిగితే కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో రేవంత్కు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇస్తుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ.. తనపై ఎన్ని రూమర్స్ వస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేటీఆర్, కేసీఆర్లను టార్గెట్ చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రేవంత్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.. కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు తెచ్చిపెడతాయో చూడాలి మరి.