మారటోరియం మరో మూడు నెలలు పెంచిన ఆర్బీఐ

కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన ఆర్బీఐ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఈఎమ్ఐలపై మూడు నెలల మారటోరియం ఇచ్చిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో చాలామందికి భారీ ఊరట లభిస్తుంది. గతంలో మార్చి నుంచి మే31 వరకు […]

Written By: Neelambaram, Updated On : May 22, 2020 5:33 pm
Follow us on

కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో ఇచ్చిన మారటోరియాన్ని మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన ఆర్బీఐ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

గతంలో ఈఎమ్ఐలపై మూడు నెలల మారటోరియం ఇచ్చిన ఆర్బీఐ తాజాగా మరో మూడు నెలలు మారటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో చాలామందికి భారీ ఊరట లభిస్తుంది. గతంలో మార్చి నుంచి మే31 వరకు మారటోరియం ఇచ్చారు. ప్రస్తుతం జూన్ 1 నుంచి ఆగష్టు 31 మారటోరియం గడువును పెంచింది.

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో 0.4 శాతం వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రెపో రేటును 4.4 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటును 3.2 శాతానికి తగ్గించింది. దాంతో వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు తగ్గనున్నాయి.

ఆర్బీఐ బ్యాంకులకు నగదు లభ్యతను పెంచింది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగమనంలో ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. లాక్డౌన్‌ వల్ల ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదుడుకుల్లో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వల్ల దేశ ఆర్థికవ్యవస్థ కుదేలయిందని ఆయన తెలిపారు.

ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరిగినట్లు ఆయన తెలిపారు. విదేశీ మారకం నిల్వలు 487 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని చెబుతూ ఏడాది చివరివరకు కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు తగ్గే అవకాశముందని ఆయన చెప్పారు. పైగా, 2021లోనూ జీడీపీ పెరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని ఆయన తెలుపుతూ మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై కరోనా ప్రభావం ఎక్కువగా పడిందని ఆయన వివరించారు.