
జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ‘ఈనాడు’ రామోజీరావు ఆయన్ని ఫాలోవుతున్నారు కదా.. కొత్త ఫాలో అయ్యేది ఏముందీ అంటారా? ఇప్పటివరకు మనం రామోజీరావు సీఎం జగన్ రాజకీయాలను.. సాక్షి మీడియాలను ఫాలో అవుతుంటారని అనుకుంటున్నాం.. కానీ రామోజీ మాత్రం మక్కికీ మక్కీగా జగన్ ఫాలో అవుతున్నారని ఓ సంఘటన ద్వారా తెలుస్తోంది. ఇంతకీ అదెంటో చూద్దాం..!
Also Read: ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మరి పంజా విసురుతున్న సంగతి తెల్సిందే. దీంతో ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలిస్తోంది. ఇక ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తూనే ఉన్నారు. ప్రజలు ముఖానికి మాస్కులు ధరించాలి.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.. భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం మాస్కు ధరించిన పాపానా పోవడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఏ కార్యక్రమం ప్రారంభించినా.. సమావేశంలో మాట్లాడిన ముఖానికి మాస్కు లేకుండా కన్పిస్తున్నారు.
సీఎం స్థాయిలో వ్యక్తే మాస్కు లేకుండా కార్యక్రమాల్లో పాల్గొనడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై వైసీపీ నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా జవాబివ్వడంతో సైలంటయ్యాయి. తాజాగా సీఎం జగన్ స్టైల్ నే రామోజీ కూడా ఫాలో అవుతున్నారనే సైటర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాస్కులు ధరించకుండా రామోజీరావు ఈటీవీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై పలువురు నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓ పత్రిక అధిపతి అయి ఉండి ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా?
ఈటీవీ రజతోత్సవ వేడుకల్లో ఈనాడు ఎండీ కిరణ్ ఆయన సతీమణి శైలజా కిరణ్ లు ముఖానికి మాస్కులతో కన్పించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన రామోజీ మాత్రం ఫొటోల్లో ఎక్కడా మాస్కులతో కన్పించినా పాపానా పోలేదు. దీంతో జగన్ స్టైల్ నే రామోజీ కాపీ కొడుతున్నారంటూ సోషల్ మీడియాలో సైటర్లు పేలుతున్నాయి. సీఎం జగన్, ఈనాడు అధినేత రామోజీలు కరోనాకు అతీతమా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. జగన్, రామోజీ మీమ్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.