Rahul Gandhi foreign visit: రాహుల్ గాంధీ మీద బిజెపి ఎంపీ సందీప్ పాత్ర కీలక విమర్శలు చేశారు. ఏకంగా ఆయన ఒక విలేకరుల సమావేశం నిర్వహించి సంచలన విషయాలను బయటపెట్టారు. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇవ్వలేదు.. రాహుల్ గాంధీ కార్యాలయం కూడా స్పందించలేదు.
2014- 15 సంవత్సరంలో రాహుల్ గాంధీ ఆదాయం 86 లక్షలు ఉంది. ఆ ఏడాది విదేశీ పర్యటనలకు రాహుల్ గాంధీ నాలుగున్నర కోట్లు ఖర్చుపెట్టారు.
2017 -18 కాలంలో 1.20 కోట్ల ఆదాయం సంపాదిస్తే.. విదేశీ పర్యటనలకు ఏకంగా ఆరు కోట్లు ఖర్చుపెట్టారు.
2018-19 కాలంలో 1.22 కోట్ల ఆదాయాన్ని సంపాదించిన రాహుల్ గాంధీ విదేశీ ప్రకటనలకు 3.9 కోట్లు ఖర్చుపెట్టారు.
2019 -20 సంవత్సరంలో రాహుల్ గాంధీ 1.29 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తే.. విదేశీ పర్యటనలకు 4.60 కోట్లు ఖర్చుపెట్టారు.
2021 -22 సంవత్సరంలో రాహుల్ గాంధీ 1.3 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తే.. 2.60 కోట్లను విదేశీ పర్యటనలకు ఖర్చుపెట్టారు.
ఆదాయానికి మించి ఆరు రేట్లు ఖర్చుపెట్టారు రాహుల్ గాంధీ.. దీనికి టాక్స్ ఎందుకు కట్టలేదని సందీప్ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. 2024లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఉజ్బెకిస్తాన్ వెళ్లారు. ఆ సమయంలో అమెరికాకు సంబంధించిన రేజిన్ చేంజ్ ఆఫ్ ఎక్స్పర్ట్ ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ దీనిని కనీసం ఖండించలేదు. ఇక అప్పట్లో నేపాల్ లో చైనా రాయబార సిబ్బందిని రాహుల్ గాంధీ కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి.
రాహుల్ గాంధీ ఈ స్థాయిలో మలేషియా, వియత్నం, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలకు ఎలా వెళ్లారు.. ఆ ఖర్చు మొత్తం ఎవరు పెట్టుకున్నారు.. అనే ప్రశ్నలు సందీప్ వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వద్ద ఒకటికి మించిన పాస్పోర్ట్ లు ఉన్నాయని.. అలహాబాద్ కోర్టులో ఈ కేసు నడుస్తుందని.. అసలు రాహుల్ గాంధీ ఈ స్థాయిలో పర్యటనలు చేస్తుంటే డబ్బులు వివరిస్తున్నారని సందీప్ పాత్ర విమర్శించారు. 22సార్లు రాహుల్ గాంధీ 59 వ్యక్తిగత విదేశీ పర్యటనలు చేశారని.. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని.. రాహుల్ గాంధీ ఆదాయం పది నుంచి 11 కోట్ల వరకు మాత్రమే ఉంటే.. ఇంత ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎవరిచ్చారని.. సందీప్ ప్రశ్నించారు.. మరి దీనిపై కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారు.. రాహుల్ గాంధీ కార్యాలయం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
