spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP BRS: ఏపీలో క్విడ్ ప్రో కో రాజ‌కీయం.. బీఆర్ఎస్ లోకి తోట చంద్ర‌శేఖ‌ర్ అందుకేనా...

AP BRS: ఏపీలో క్విడ్ ప్రో కో రాజ‌కీయం.. బీఆర్ఎస్ లోకి తోట చంద్ర‌శేఖ‌ర్ అందుకేనా ?

AP BRS: ఏపీలో క్విడ్ ప్రో కో రాజ‌కీయం మొద‌లైంది. ఏపీ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు తోట చంద్ర‌శేఖ‌ర్ ముసుగు క్ర‌మంగా తొలుగుతోంది. ఏపీ బీఆర్ఎస్ ప‌గ్గాలు చేప‌ట్ట‌డం వెనుక మ‌ర్మం బ‌య‌ట‌ప‌డుతోంది. దీని వెనుక స్వ‌ప్ర‌యోజ‌నాలు త‌ప్ప ప్ర‌జాప్ర‌యోజ‌నాలు లేవ‌న్న సంగ‌తి తేట‌తెల్ల‌మ‌వుతోంది. ఏ నినాదం వెనుక ఏ వ‌ర్గ ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో అన్న కొటేష‌న్ తోట చంద్ర‌శేఖ‌ర్ వైఖ‌రికి అద్దం ప‌డుతోంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. తోట పార్టీ మార్పు వెనుక ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు దాగున్నాయో ఆలోచించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది.

AP BRS
KCR

 

తోట చంద్ర‌శేఖ‌ర్.. జ‌న‌సేన‌లో కీల‌క నేత‌. మాజీ ఐఏఎస్ అధికారి. తెలుగులో ఓ టీవీ చానెల్ న‌డుతున్న మీడియా య‌జ‌మాని. ఉన్న‌ట్టుండి బీఆర్ఎస్ కార్యాల‌యంలో ఎంట్రీ ఇచ్చారు. కేసీఆర్ స‌మ‌క్షంలో బీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. కేసీఆర్ విధివిధానాల్ని ఆహా.. ఓహో అంటూ ఆకాశానికెత్తేశారు. జ‌న‌సేన‌కు విధివిధానాలు లేవంటూ విమ‌ర్శించారు. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు విధివిధానాలు లేని పార్టీలో కీల‌క నేత‌గా ఎలా కొన‌సాగారో ఆయ‌న‌కే తెలియాలి.

తోట చంద్ర‌శేఖ‌ర్ బీఆర్ఎస్ ఎంట్రీ వెనుక చాలా రాజ‌కీయం ఉంద‌ని తెలుస్తోంది. ఏపీలో కాపు ఓట్ల చీలికే ప్ర‌ధాన ల‌క్ష్యంగా.. జ‌గ‌న్ కు మేలు చేయ‌డ‌మే బాధ్య‌త‌గా ఏపీ బీఆర్ఎస్ బాధ్య‌త‌లు భుజానికెత్తుకున్నార‌ని వినికిడి. కేసీఆర్ బీఆర్ఎస్ ఎంట్రీతో కాపు ఓట్లు జ‌నసేన‌కు గంప‌గుత్త‌గా వెళ్ల‌కుండా చీల్చాల‌ని, తద్వార జ‌గ‌న్ కు మేలు చేయాల‌ని ఎత్తుగ‌డ వేసిన‌ట్టు విశ్లేష‌కుల అంచ‌నా. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చ‌నివ్వ‌న‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో.. తోట చంద్రశేఖ‌ర్ ద్వార కాపు ఓట్లు చీల్చాల‌ని కేసీఆర్, జ‌గ‌న్ క‌లిసి ఆడుతున్న జ‌గ‌న్నాట‌కంలో తోట చంద్ర‌శేఖ‌ర్ పాత్ర‌ధారిగా మారార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

AP BRS
KCR

స్వ‌ప్ర‌యోజ‌నం లేకుండా తోట చంద్ర‌శేఖ‌ర్ బీఆర్ఎస్ ప‌గ్గాలు ప‌ట్ట‌లేద‌ని మ‌రో వాద‌న‌. హైద‌రాబాద్ లో పెద్ద ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు తోట చంద్ర‌శేఖ‌ర్. బీఆర్ఎస్ ఏపీ బాధ్య‌తలు చేప‌ట్టినందుకు పెద్ద ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ లో ల‌బ్ధి పొంద‌నున్నార‌ని తెలంగాణ‌లో ప‌లువురి అభిప్రాయం. తోట చంద్ర‌శేఖ‌ర్ ను కేసీఆర్ వ‌జ్రంతో పోల్చారు. మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయిన చంద్ర‌శేఖ‌ర్.. కేసీఆర్ కు వ‌జ్రంలా ఎలా క‌న‌ప‌డ్డారో అన్న సందేహం వెలిబుచ్చుత‌న్నారు. అటు కేసీఆర్.. ఇటు తోట చంద్రేశేఖ‌ర్ ఇరువురూ ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల కోస‌మే జ‌గ‌న్నాట‌కంలో సూత్ర‌ధారి, పాత్ర‌ధారుల‌య్యార‌న్న వాద‌న వినిపిస్తోంది.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Oktelugu Epaper