spot_img
Homeజాతీయ వార్తలుBhagwant Mann: నాడు ఆ కామెడీ షోలో ‘సిద్దూ’నే ప్రశ్నించిన భగవంత్ మాన్.. ఇప్పుడు ఏకంగా...

Bhagwant Mann: నాడు ఆ కామెడీ షోలో ‘సిద్దూ’నే ప్రశ్నించిన భగవంత్ మాన్.. ఇప్పుడు ఏకంగా సీఎం!.. వైరల్

Bhagwant Mann: ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయనేది సామెత. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలియని వైనం. ఒకప్పుడు బద్ధ శత్రువులే ఆప్త మిత్రులు కావచ్చు. మంచి మిత్రులే శత్రువులే అవుతారు. దీంతో ఎప్పుడైనా ఎవరిని కూడా కించపరచే విధంగా మాట్లాడటం తగదని తెలుసుకోవాలి. ఇటీవల విడుదలైన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ నిలవడం తెలిసిందే. దీంతో పంజాబ్ లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Bhagwant Mann
Bhagwant Mann

ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. భగవంత్ మాన్, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. 2016లో నిర్వహించిన ఓ స్టాండప్ కమెడియన్ షోలో సిద్దూ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇందులో పోటీదారుగా వ్యవహరించిన భగవంత్ మాన్ సిద్దూను మెప్పించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అప్పుడు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుని అభిమానులు దానికి సంబంధించిన గుర్తులను నెమరువేసుకుంటున్నారు.

Also Read: యూపీలో యోగి సాధించిన రికార్డులు ఏంటి?

ఈ షోలో భగవంత్ మాన్ ప్రభుత్వం అంటే ఏంటని ప్రశ్నించగా సిద్దూ చెప్పిన సమాధానంతో అందరు నవ్వుకున్నారు. ప్రభుత్వమంటే ఎప్పటికప్పుడు మరిచిపోయేదే అని వ్యంగ్యంగా సమాధానం చెప్పడంతో అప్పుడు జోకర్ గా మారిన భగవంత్ మాన్ ఇప్పుడు సిద్దూను జోకర్ గా మారుస్తూ అధికారం చేజిక్కించుకోవడంపైనే చర్చించుకుంటున్నారు. ఆప్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. దీంతో సిద్దూ ఒకప్పుడు భగవంత్ మాన్ ను నవ్వులపాలు చేస్తే ఇప్పుడు ఆయనను కోలుకోలేని దెబ్బ తీసిన వైనం పై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Bhagwant Mann
Bhagwant Mann

ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయంతో అన్ని పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్న సందర్భంలో కామెడీ షోలో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవంపై పోస్టుమార్టమ్ నిర్వహిస్తోంది. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తోంది. ఇంతటి దారుణమైన ఓటమిపై నేతలు ఆరా తీస్తున్నారు. ఆప్ విజయం ఊహించినదేనని చెబుతున్నారు.

అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్నది. ఉత్తరప్రదేశ్ లో మరీ అధ్వానంగా ఓడిపోయింది. దీంతో అధిష్టానం దీనిపై దృష్టి సారించింది. ఇంతటి ఓటమికి కారణాలేంటని నేతలు మథనపడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోవడం చూస్తుంటే ఇక కోలుకోలేదని చెబుతున్నారు. ఇకపై ఎన్ని వ్యూహాలు పన్నినా తట్టుకోవడం కలేనని చెబుతున్నారు.

Also Read: సీఎం కేసీఆర్ ఆస్పత్రి పాలవడంపై బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్

 

Radhe Shyam First Review || Radhe Shyam Review Telugu || Prabhas || Ok Telugu Entertainment

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper
Exit mobile version