Homeఆంధ్రప్రదేశ్‌Union Budget Of India 2022: నదుల అనుసంధానానికి కేంద్రం అడుగులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..

Union Budget Of India 2022: నదుల అనుసంధానానికి కేంద్రం అడుగులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..

Union Budget Of India 2022: మనదేశంలో సుదీర్ఘ కాలంగా నదుల అనుసంధానికి సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యల ద్వారా నదుల అనుసంధానానికి సంబంధించిన తొలి అడుగు పడుతోంది.ఈ నేపథ్యంలోనే నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి చర్చ జరగాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుల్లో కెన్-బెత్వా ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.44,605 కోట్ల వ్యయం కానుంది. కాగా, కేంద్రం రూ.1,400 కోట్లు కేటాయించింది.

Union Budget Of India 2022
Union Budget Of India 2022

అలా కెన్-బెత్వా ప్రాజెక్టుకు తొలి అడుగులు అయితే పడుతున్నాయి. ఈ రెండు నదులు కూడా మధ్యప్రదేశ్ లో పుడతాయి. కాగా, ఇవి ఉత్తర ప్రదేశ్ లోని యమునా నదిలో కలుస్తాయి. కెన్ నదిలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ నదిలోని నీటిని బెత్వాలో కలిపినట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయి. అలా ఈ రెండు నదుల అనుసంధానం ప్రాజెక్టు పూర్తి అయితే కనుక ఉభయ రాష్ట్రాల్లోని బుందేల్ ఖండ్ ప్రాంతానికి ప్రయోజనాలు చేకూరుతాయి.

Union Budget Of India 2022
Union Budget Of India 2022

Also Read: Union Budget Of India 2022: వేతన జీవులకు ఊరట? నేటి బడ్జెట్లో కీలక పాయింట్ ఇదే!

ఇకపోతే దేశంలో నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులు కెన్-బెత్వా మాత్రమే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. దమన్ గంగ- పింజల్, గోదావరి -కృష్ణ, పెన్నా-కావేరి, కృష్ణ-పెన్నా, పార్ -తాపి- నర్మద, ఇలా ప్రాజెక్టులు ఉండగా వీటికి సంబంధించిన డీపీఆర్ లను అధికారులు సిద్ధం చేయనున్నారు.

గోదావరి – కృష్ణ నదులకు సంబంధించి పరివాహక రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కాగా, పెన్నా నది ఆంధ్రప్రదేశ్ లో ఉండగా, కావేరి పరివాహక ప్రాంతం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. ఈ నేపథ్యంలో పరివాహక రాష్ట్రాలతో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేయనున్నారు. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత పనులను కేంద్రం ప్రారంభించనుంది. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానం జరగాలంటే మొదలు నీటి లభ్యత తేల్చాల్సి ఉంటుంది. గోదావరి నీటి లభ్యత తెలిపి అనుసంధాన ప్రక్రియ షురూ చేయాలని ఇంతకు మునుపే తెలంగాణ కేంద్రాన్ని కోరింది. కాగా, ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నదుల అనుసంధానం వలన తమ ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా చూడాలని కేంద్రానికి ఏపీ కూడా సూచించింది. చూడాలి మరి.. ఈ అనుసంధాన ప్రక్రియ స్టార్ట్ కావడానికి ఎంత టైం పడుతుందో..

Also Read: Union Budget Of India 2022: అసలైన విషయాలపై కేంద్రానికి సోయిలేదు.. బడ్జెట్‌పై కేసీఆర్ ఫైర్..

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version