Homeఆంధ్రప్రదేశ్‌మరోసారి దేశవ్యాప్త సంచలనమైన ప్రశాంత్‌ కిషోర్

మరోసారి దేశవ్యాప్త సంచలనమైన ప్రశాంత్‌ కిషోర్

Prashant Kishor
ప్రశాంత్‌ కిషోర్‌‌.. ఎంత గొప్ప ఎన్నికల వ్యూహకర్త అందరికీ తెలుసు. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణం కూడా ఆయనే. యాంటీ బీజేపీ ఆయన వ్యూహం. అదే లక్ష్యంతో చాలా రాష్ట్రాల్లోనూ అపోజిషన్‌ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చారు కూడా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆయన వ్యూహకర్తగా ఉన్నారు. జగన్‌ గెలుపుతో సంచలనం సృష్టించిన ఆయన.. ఇపుడు మరోసారి క్రేజ్‌ పెంచుకున్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా మరింత డిమాండ్‌ పెరిగిందని చెప్పాలి.

Also Read: వైరల్ : సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్..

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ట్రెండ్ నడుస్తోంది. వరుస విజయాలతో ప్రశాంత్ కిషోర్ చుట్టూ రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీల దెబ్బకు కుదేలైన ప్రాంతీయ పార్టీలన్నీ ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలకు విజయాలను అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. 151 స్థానాలు రావడం వెనక వ్యూహకర్త వ్యూహలు ఉన్నాయంటున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సోషల్ మీడియా ప్రచారం వరకూ ప్రశాంత్ కిషోర్ టీం చూసుకుంటుండటంతో డబ్బులు పోయినా రాజకీయ పార్టీల అధినేతలకు చాలా టెన్షన్‌లు తప్పుతున్నాయి.

Also Read: త్యాగ పురుషుడిగా మారిన పవన్.. తిరుపతిలోనూ బీజేపీనే పోటీ

ఢిల్లీలోనూ అరవింద్ కేజ్రీవాల్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ కీలక పాత్రను పోషించారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కు, తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకేకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి రెండంకెల సీట్లు దాటితే తాను ట్విట్టర్ నుంచి తొలుగుతానని ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఆయన మరోసారి మమత బెనర్జీ అధికారంలోకి వస్తారనే ధీమాలోనే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అంచానాలకు అనుగుణంగానే ఏబీపీ, సీ-ఓటరు ఓపీనియన్ పోల్ కూడా ఇదే తేల్చింది. పశ్చిమ బెంగాల్ లో 148 నుంచి 164 సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. తమిళనాడులో డీఎంకే కూటమికి 154 నుంచి 162 సీట్లు వచ్చే అవకాశముందని తేల్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో టీఎంసీ, డీఎంకే గెలిస్తే ప్రశాంత్ కిషోర్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశముంది. మరి పూర్తిస్థాయిలో ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైతే కానీ అసలు విషయం తెలిసేలా లేదు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version