రాజధానిలో మరో షాకింగ్ న్యూస్!

దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యే రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటి. ఇంతలోనే మరో భయంకరమైన వార్త నగర వాసులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. దేశ రాజధాని లో ఒక పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఢిల్లీలో ఆందోళన నెలకొంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఈ యువకుడు పని చేస్తున్నాడు. డెలివరీ బాయ్ దాదాపు వంద కుటుంబాలకు పిజ్జా డెలివరీ చేసి ఉంటాడని […]

Written By: Neelambaram, Updated On : April 16, 2020 3:02 pm
Follow us on


దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యే రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటి. ఇంతలోనే మరో భయంకరమైన వార్త నగర వాసులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. దేశ రాజధాని లో ఒక పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఢిల్లీలో ఆందోళన నెలకొంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఈ యువకుడు పని చేస్తున్నాడు.

డెలివరీ బాయ్ దాదాపు వంద కుటుంబాలకు పిజ్జా డెలివరీ చేసి ఉంటాడని అంచనా వేస్తున్నారు అధికారులు. అతను పిజ్జా డెలివరీ చేసిన కుటుంబాల వారందరినీ క్వారంటైన్ చేశారు. అలాగే  అతని తో  చేసే మిగిలిన పిజ్జా డెలివరీ బాయ్స్ ను కూడా క్వారంటైన్ కు తరలించారు.

 

భారతదేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా కరోనావైరస్ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. ఇప్పటివరకు ఢిల్లీలో 1,500 మందికి పైగా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని తేలింది.